Play all audios:
ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ శనివారం ఉదయాన్నే ప్రారంభమైంది. జూన్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందజేస్తున్నారు. అమరావతి: ఏపీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
శనివారం ఉదయాన్నే ప్రారంభమైంది. జూన్ ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే పింఛన్లు అందజేస్తున్నారు. ఉదయం 8.30 గంటలకే రాష్ట్ర వ్యాప్తంగా 52 శాతం మేర పింఛన్ల పంపిణీ పూర్తయింది. నేడు
ముఖ్యమంత్రి చంద్రబాబు కోనసీమ అంబేడ్కర్ జిల్లాలో పర్యటించనున్నారు. చెయ్యేరులో పింఛన్ల పంపిణీలో పాల్గొననున్నారు. (Andhra Pradesh News) అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం ఉద్దండపురం
గ్రామంలో హోంమంత్రి అనిత పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. మంత్రి స్వయంగా లబ్ధిదారులకు ఇళ్లకు వెళ్లి అందజేశారు. గ్రామంలో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని
విధంగా తమ కూటమి ప్రభుత్వం ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా పింఛన్ నగదును అందజేస్తోందని హోంమంత్రి వివరించారు.