Play all audios:
అమరావతి: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితులు, మాజీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితులైన నలుగురిని సిట్ కస్టడీకి తీసుకుంది. ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజ్ కెసిరెడ్డి, సీఎంవో మాజీ కార్యదర్శి,
విశ్రాంత ఐఏఎస్ అధికారి కె.ధనుంజయరెడ్డి, జగన్ ఓఎస్డీ పి.కృష్ణమోహన్రెడ్డి, భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీలను విజయవాడలోని జిల్లా జైలు నుంచి అధికారులు కస్టడీకి తీసుకున్నారు.
జైలు నుంచి ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక నిందితులను సిట్ కార్యాలయానికి తీసుకొచ్చారు. సాయంత్రం 6 గంటల వరకు వారిని విచారించనున్నారు. మద్యం
కుంభకోణం కేసులో ఈ నలుగురిని రెండు రోజుల పాటు సిట్ కస్టడీకి ఇస్తూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. శుక్ర, శనివారాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకూ నలుగురినీ
కస్టడీలో విచారించేందుకు అనుమతిచ్చింది. కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు చివరిగా ఎక్కడికి చేరిందో వీరికి తెలుసని, ‘అంతిమ లబ్ధిదారు’కు డబ్బు చేర్చడంలో వీరు కీలకంగా వ్యవహరించారని గుర్తించిన
సిట్.. ఆ కోణంలో ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. కుట్రకు రూపకల్పన, అమలు, ముడుపుల వసూళ్లు, ఆ మొత్తాల్ని ‘బిగ్బాస్’కు, ఆయన సతీమణికి చేర్చడంలో ఈ నలుగురి పాత్రపై ఇప్పటికే కొన్ని కీలక ఆధారాల్ని
సేకరించిన దర్యాప్తు అధికారులు.. వాటి ఆధారంగా మరింత లోతుగా వివరాలు రాబట్టనున్నారు. (Andhra Pradesh News)