Play all audios:
ప్రభుత్వరంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Ltd) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రూ.6043.99 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. దిల్లీ: ప్రభుత్వరంగ
సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Ltd) త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రూ.6043.99 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో
రూ.2,932.73 కోట్ల నికర లాభంతో పోలిస్తే.. ఈ సారి 106 శాతం వృద్ధిని నమోదు చేసింది. కంపెనీ ఆదాయం సైతం రూ.23,291.08 కోట్ల నుంచి రూ.29,838.07 కోట్లకు పెరిగింది. ఖర్చులు సైతం రూ.20,424.52 నుంచి
రూ.23,770.12 కోట్లకు పెరిగినట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. ప్రస్తుత ఆర్థికసంవత్సరానికి గానూ తొలి మధ్యంతర డివిడెండ్ కంపెనీ ప్రకటించింది. ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.15 చొప్పున
డివిడెండ్ చెల్లించేందుకు బోర్డు ఆమోదం తెలిపింది. దేశీయంగా వెలికితీసే బొగ్గులో 80 శాతం వాటా ఒక్క కోల్ ఇండియాదే. సమీక్షా త్రైమాసికంలో 154 మెట్రిక్ టన్నుల బొగ్గును వెలికి తీసింది. గతేడాది
ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం 147 టన్నులుగా ఉంది. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో 700 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి 1 బిలియన్
టన్నుల కోల్ను ఉత్పత్తి చేయాలని కేంద్రం కోల్ ఇండియాకు లక్ష్యాన్ని నిర్దేశించింది.