Covid 19: దేశంలో 4 వేలకు చేరువైన కొవిడ్‌ కేసులు

Covid 19: దేశంలో 4 వేలకు చేరువైన కొవిడ్‌ కేసులు

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో కొవిడ్‌(Corona virus) వ్యాప్తి రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం జూన్‌ 2న ఉదయం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య


3,900 మార్కును దాటి.. నాలుగు వేలకు చేరువలో ఉంది. కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌లలో కూడా కేసులు గణనీయంగా పెరుగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. కేరళ, కర్ణాటకలో ఈ ఇన్ఫెక్షన్‌తో తాజాగా


రెండు మరణాలు సంభవించినట్లు తెలిపారు. దీంతో 2025 జనవరి నుంచి దేశంలో కొవిడ్‌ మరణాల సంఖ్య 32కి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 2,188 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయినట్లు పేర్కొన్నారు.


కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. 24 గంటల్లో 360 కొత్త ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయన్నారు. కాగా దేశంలో పెరుగుతున్న కొవిడ్‌


కేసులపై ఇటీవల ప్రపంచ ఆరోగ్యసంస్థ (WHO) స్పందిస్తూ.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఇతర వేరియంట్లతో పోలిస్తే ఇది తీవ్రమైన అనారోగ్యానికి దారితీస్తుందన్న  సూచనలు ఏమీ లేవని పేర్కొంది.


ఇప్పటికే ఆమోదం పొందిన కొవిడ్‌ వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌ లక్షణాలు, ప్రభావాన్ని కట్టడి చేయడంలో సమర్థంగా పనిచేస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది.  రాష్ట్రాల వారీగా కొవిడ్‌ కేసులు ఇలా..


డేటాబోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,961గా ఉండగా, కేరళలో అత్యధికంగా 1,435 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 506 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఏడుగురు


మరణించారు. దిల్లీలో 483, పశ్చిమబెంగాల్‌లో 339, గుజరాత్‌లో 338, తమిళనాడులో 199, ఉత్తరప్రదేశ్‌లలో 149, ఒడిశా 12, గురుగ్రామ్‌ 12, పంజాబ్‌ 6లో కేసులు నమోదయ్యాయి.