Mohammad harun: పహల్గాం ఉగ్ర దాడికి ముందు పాక్‌కు మహమ్మద్‌ హరూన్‌..

Mohammad harun: పహల్గాం ఉగ్ర దాడికి ముందు పాక్‌కు మహమ్మద్‌ హరూన్‌..

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌ (Pakistan)కు గూఢచర్యం చేస్తున్నారన్న అనుమానంతో ఉత్తరప్రదేశ్‌ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌ బృందం ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. దిల్లీలో


తుక్కు వ్యాపారం చేసే మొహమ్మద్‌ హరూన్‌ (Mohammad Harun)ను నోయిడాలో అదుపులోకి తీసుకొన్నారు. హరూన్‌ పహల్గాం ఉగ్రదాడికి ముందు పాకిస్థాన్‌ వెళ్లినట్లు అతడి కుటుంబం వెల్లడించింది. ఈ మేరకు హరూన్


సోదరుడు సాహిద్ మీడియాతో మాట్లాడారు (Espionage Charge). ‘‘ఇటీవల కాలంలో పాకిస్థాన్‌ నుంచి వచ్చినవారి కోసం వెతుకుతున్నామంటూ కొందరు వ్యక్తులు హరూన్ ఇంటికి వచ్చారు. ఆ సమయంలో మా సోదరుడు ఇంట్లో


లేడు. దాంతో నా దగ్గరకు వచ్చారు. పాస్‌పోర్ట్ ఆఫీస్‌ నుంచి వచ్చామని చెప్పారు. పాక్‌ నుంచి వచ్చినవారి దగ్గరి నుంచి సంతకాలు తీసుకొని, ప్రశ్నించి పంపించివేస్తామని చెప్పారు. కొద్దిసేపటికి హరూన్


వారితో వెళ్లాడు. కానీ తిరిగి రాలేదు. అతడి ఫోన్ చాలాసార్లు మోగింది. ఇప్పుడు స్విచ్ఛాఫ్‌ వస్తోంది. మేం పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే.. తమకు ఏమీ తెలియదని, అతడిని నోయిడా తీసుకెళ్లారని చెప్పారు.


తర్వాత హరూన్‌ను లఖ్‌నవూ కోర్టుకు తీసుకెళ్లారు. మేం అక్కడికి వెళ్లేసరికి ఆలస్యం కావడంతో అతడిని కలుసుకోలేకపోయాం. హరూన్ తరచూ పాక్‌ వెళ్తుంటాడు. అక్కడ అతడికి రెండో భార్య ఉంది. చివరిసారిగా


ఏప్రిల్ 5న వెళ్లి, 25వ తేదీన తిరిగి వచ్చాడు. కొవిడ్ సమయంలో స్థానికులకు ఎంతో సహాయం చేశాడు’’ అని వెల్లడించాడు. * ఆపరేషన్‌ సిందూర్‌: పాక్‌లో 200 మందికి పైగా మృతి.. ఉగ్రవాదులే అత్యధికం..! హరూన్


తల్లి మాట్లాడుతూ.. ‘‘నా 12 ఏళ్ల వయసు నుంచి ఇక్కడ ఉంటున్నాను. ఏదో జరుగుతుంది అనేలా నా కుమారుడు ఎప్పుడూ ఏమీ మాట్లడలేదు. అరెస్ట్ సమయంలో నేను లేను. పాక్‌లో రెండో వివాహం చేసుకున్నాడు. ప్రతి


ఏడాదికి ఒకసారి అక్కడికి వెళ్తుంటాడు. ఏదైనా తప్పుగా జరుగుతుందని అనుకుంటే.. సరిహద్దులు ఎందుకు దాటనిచ్చారు..?’’ అని ఆమె ప్రశ్నించారు. దిల్లీలో తుక్కు వ్యాపారం చేసే మొహద్‌ హరూన్‌ను నోయిడాలో


అదుపులోకి తీసుకొన్నారు. అతడికి పాకిస్థాన్‌ దౌత్య కార్యాలయంలోని ముజమ్మల్‌ హుస్సేన్‌తో సంబంధాలున్నట్లు గుర్తించారు. ఇతడు వీసా కోసం డబ్బులు, ఇతర సున్నిత సమాచారం చేరవేయడంతోపాటు.. తీవ్రవాద భావజాల


వ్యాప్తికి పాల్పడుతున్నట్లు అనుమానం. హరూన్‌కు పాక్‌ దౌత్య సిబ్బంది అయిన ముజమ్మిల్‌తో బలమైన సంబంధాలున్నాయని అధికారులు చెబుతున్నారు. వారు నిత్యం కాంటాక్ట్‌లో ఉన్నట్లు గుర్తించారు. హరూన్‌కు


పాకిస్థాన్‌లో బంధుత్వాలు ఉండటంతో.. ముజమ్మిల్‌ వీసాలను ఇప్పించినట్లు అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇక హరూన్‌ పాక్‌ వీసాలు ఇప్పిస్తానంటూ పలువురి నుంచి డబ్బులు వసూలుచేసి వివిధ బ్యాంకు


ఖతాల్లో జమ చేస్తున్నట్లు గుర్తించారు. ఆ సొమ్ములో కొంత కమిషన్‌ తీసుకొని.. ముజమ్మిల్‌ చెప్పిన వ్యక్తులకు మిగిలిన మొత్తం ఇచ్చేవాడు. అతడు పాక్‌ దౌత్య కార్యాలయంలో పని చేస్తున్నట్లు తెలిసినా..


హరూన్‌ సహకరించాడని ఏటీఎస్‌ బృందం చెబుతోంది. దీంతో సున్నితమైన సమాచారం చేరవేసి ఉండొచ్చని సమాచారం. ఇటీవలే ప్రభుత్వం ముజమ్మిల్‌ హుస్సేన్‌ను అనుమానిత వ్యక్తిగా ప్రకటించిన భారత్‌.. అతడిని


స్వదేశానికి తిరిగి పంపింది.