Play all audios:
ఎన్నికల ప్రచార వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ కీలక ప్రకటన చేశారు. (మీడియాతో మాట్లాడుతున్న ప్రశాంత్ కిశోర్- ఫైల్ ఫొటో) పట్నా: ఎన్నికల ప్రచార వ్యూహకర్త, జన్
సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) కీలక ప్రకటన చేశారు. తాను స్థాపించిన రాజకీయ పార్టీకి తొలి జాతీయ అధ్యక్షుడిగా మాజీ ఎంపీ ఉదయ్ సింగ్(Uday Singh) ఏకగ్రీవంగా
ఎన్నుకున్నట్లు వెల్లడించారు. పట్నాలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇకపై తాను ప్రజలకు చేరువయ్యే అంశంపై దృష్టిసారించనున్నట్లు తెలిపారు. పార్టీని నడిపించే బాధ్యతను ఉదయ్సింగ్, ఆర్సీపీ
సింగ్...తదితర నేతలకు అప్పగిస్తున్నట్లు తెలిపారు. గతంలో నిలిచిపోయిన తన పాదయాత్రను మంగళవారం నుంచే పునఃప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. * ఆశ్రయం ఇచ్చేందుకు
భారత్ ధర్మశాల కాదు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు గతేడాది అక్టోబర్ 2న ప్రశాంత్ కిశోర్ జన్ సురాజ్ పార్టీని ప్రారంభించారు. అప్పటి నుంచి ఆ పార్టీ పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకుండానే
పనిచేస్తోంది. తాను ఏ పదవినీ ఉంచుకోనంటూ గతంలోనే స్పష్టం చేసిన ప్రశాంత్ కిశోర్.. పార్టీ ఏర్పాటైన వెంటనే మాజీ ఐపీఎస్ అధికారి మనోజ్ భారతిని జన్ సురాజ్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా
ప్రకటించిన విషయం తెలిసిందే.