Play all audios:
విశాఖలో ఫిలిం డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సమావేశం ముగిసింది. సినీ పరిశ్రమలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఈ భేటీలో చర్చించినట్లు నిర్మాత సి.కల్యాణ్ తెలిపారు. అక్కయ్యపాలెం:
విశాఖపట్నం వేదికగా పలువురు సినీ ప్రముఖులు శుక్రవారం ఉదయం కీలక సమావేశం నిర్వహించారు. దొండపర్తిలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు సమావేశమయ్యారు. నిర్మాతలు స్రవంతి రవికిశోర్,
సి.కల్యాణ్, సుధాకర్రెడ్డి, భరత్ భూషణ్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. భేటీ అనంతరం సి.కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. సినిమా టికెట్లు, థియేటర్ల నిర్వహణ, పర్సంటేజీలపై ఈ సమావేశంలో
చర్చించినట్లు తెలిపారు. ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. * ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు రావడం నా అదృష్టం: బాలకృష్ణ ‘‘డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు, నిర్మాతల సంఘాల్లోని
సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. ఒక్కో సంఘం నుంచి 9 మంది చొప్పున 27మందితో ఈ కమిటీ ఉంటుంది. కమిటీ సభ్యుల పేర్లు తొలుత ప్రభుత్వానికి తెలియజేస్తాం. కమిటీకి సంబంధించిన వివరాలను సోమవారం
మీడియాకు వెల్లడిస్తాం. ప్రస్తుత సమస్యలు, థియేటర్ నిర్వహణ, పర్సంటేజీలపై చర్చ జరిగింది. నిరంతరం తనిఖీల్లో భాగంగానే సినిమా హాళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి. ప్రతి నెలా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్
సమావేశం ఉంటుంది’’ అని కల్యాణ్ వెల్లడించారు.