Play all audios:
విక్కీ కౌశల్ (Vicky kaushal) హీరోగా నటించిన ‘ఛావా’ (Chhaava)తో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar). వరుస సినిమాలతో ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్న ఆయన
గతంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారట. ఇదే విషయాన్ని ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇంటర్నెట్డెస్క్: ‘ఛావా’ (Chhaava)తో ఈ ఏడాది బాలీవుడ్లో ఘన విజయాన్ని అందుకున్నారు దర్శకుడు లక్ష్మణ్
ఉటేకర్ (Laxman Utekar). విక్కీ కౌశల్ (Vicky kaushal) హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.800 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. కెరీర్ పరంగా వరుస సినిమాలతో ప్రేక్షకులకు
వినోదాన్ని పంచుతున్న ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను పంచుకున్నారు. సినిమాల్లోకి రాకముందు తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని
చెప్పారు. ‘‘సినిమాల్లోకి రావాలని నేనెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే, ఈ పరిశ్రమలో నాకు తెలిసిన వారు ఎవరూ లేరు. అనుకోకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. నాలుగేళ్ల వయసప్పుడు మా బంధువులు నన్ను
ముంబయికి తీసుకువచ్చారు. ఆరేళ్లకే డబ్బు సంపాదించడంపై శ్రద్ధ పెట్టా. ఆరోజుల్లో మద్యం దుకాణాల ఎదుట కోడిగుడ్లు అమ్మాను. ఆ తర్వాత శివాజీ పార్క్లో వడాపావ్ షాప్ నడిపా. కొన్నిరోజులకే దానిని
బీఎంసీ సీజ్ చేసింది. అలాంటి సమయంలో నా స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు గణపతి ఉత్సవాల్లో దేవుడి విగ్రహాల నిమజ్జనానికి వెళ్లేవాడిని. ధనవంతుల నుంచి స్వామి వారి విగ్రహాలు తీసుకుని నిమజ్జనం
చేసేవాడిని. అలా చేసినందుకు వారు డబ్బులు ఇచ్చేవారు. ఓరోజు పేపర్లో ఫిల్మ్ స్టూడియోలో పనిచేయడానికి మనుషులు కావాలనే ప్రకటన చూశా. అక్కడ ఏం పని ఉంటుందో తెలియదు కానీ డబ్బు కోసం వెళ్లా. ఆ
స్టూడియోలో ఫ్లోర్లు, వాష్ రూమ్స్ శుభ్రం చేశా. అక్కడి వారికి టీలు అందించేవాడిని. అలాంటి సమయంలో ఎడిటింగ్, సినిమా మేకింగ్కు సంబంధించిన పలు విషయాలు తెలుసుకున్నా. అవి నాకెంతో ఆసక్తిగా
అనిపించాయి. కొన్నేళ్లపాటు శ్రమించి చివరకు ఈ పరిశ్రమలోకి అడుగుపెట్టా’’ అని లక్ష్మణ్ చెప్పారు. * ఈ వారం ఓటీటీలో క్రేజీ మూవీలు.. ఆసక్తికర వెబ్సిరీస్లు వచ్చేశాయ్ సినిమాటోగ్రాఫర్ వినోద్
ప్రధాన్కు అసిస్టెంట్గా సినీ పరిశ్రమలో కెరీర్ ఆరంభించారు లక్ష్మణ్. ‘102 నాటౌట్’, ‘హిందీ మీడియం’, ‘డియర్ జిందగీ’ వంటి చిత్రాల కోసం పనిచేశారు. 2014లో విడుదలైన ‘తాపాల్’ అనే మరాఠి చిత్రంతో
దర్శకుడిగా తొలి అడుగు వేశారు. ‘లూకా చుప్పి’, ‘మిమీ’ వంటి చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ జీవిత కథతో రూపొందిన ‘ఛావా’ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది.
ఫిబ్రవరి నెలలో విడుదలైన ఈ చిత్రం సినీ ప్రియుల ప్రశంసలు సొంతం చేసుకుంది.