Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: సామాజిక అంశాల గురించి మాట్లాడటంలో ఎప్పుడూ ముందుంటారు నటి రేణూ దేశాయ్ (Renu Desai). దేశం కోసం ఆలోచించండి అంటూ తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. చైనా ఉత్పత్తులను
ఉపయోగించడం మానేయాలని సూచించారు. ‘‘ మన దేశం, మన కుటుంబ భద్రత గురించి మీరు నిజంగా శ్రద్ధ వహిస్తే.. చైనాలో తయారైన చిన్న వస్తువును కూడా కొనడం మానేయండి. ఏదైనా కొనే ముందు లేబుల్ చదవడం
ఇప్పటినుంచైనా ప్రారంభించండి. చైనా ఉత్పత్తులను కొనడం మానేశామని అందరికీ తెలిసేలా చేయండి. నేను ఇప్పటివరకూ ఆ దేశంలో తయారైన వాటిని కొన్నాను. కానీ, ఈ మధ్య ప్రతి వస్తువుపై ఉండే లేబుల్ను
చదువుతున్నాను. అది చైనాలో తయారైంది అయితే కొనడం మానేయడానికి ప్రయత్నిస్తున్నా. ఇది సుదీర్ఘమైన ప్రక్రియ. కనీసం ఇప్పటినుంచైనా ప్రారంభిద్దాం. మీరు కొనాలనుకునే వస్తువు ఎక్కడ తయారైందో తెలుసుకోండి.
మన దేశాన్ని ఆదరిద్దాం’’ అని పోస్ట్లో రాసుకొచ్చారు. * సమంత - రాజ్లపై రూమర్స్.. స్పందించిన మేనేజర్ ఈ పోస్ట్ను అందరూ షేర్ చేయాలని కోరారు. ‘మనమందరం ఎక్కడో ఒకచోట దీన్ని ప్రారంభించాలి. మన
దేశానికి, మన మాతృభూమికి మనం మద్దతు ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు?. ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. అర్థం లేని టీవీ రియాలిటీ షోల గురించి రూమర్స్ మాట్లాడుకోవడం కంటే, మన దేశ పరిస్థితి
గురించి చర్చించుకోవడం మొదలుపెడదాం’ అని తెలిపారు.