Play all audios:
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్కు అమెరికాలోని బోస్టన్కు చెందిన ఎన్ఆర్ఐ భాగవతుల ఆనంద్మోహన్ భారీ విరాళం అందజేశారు. తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ట్రస్ట్కు అమెరికాలోని
బోస్టన్కు చెందిన ఎన్ఆర్ఐ భాగవతుల ఆనంద్మోహన్ భారీ విరాళం అందజేశారు. తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడుని క్యాంప్ కార్యాలయంలో కలిసి విరాళం డీడీలను అందజేశారు. ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్కు
రూ.1,00,01,116లు, ఎస్వీ విద్యాదాన ట్రస్ట్కు రూ.10,01,116లు, ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్కు రూ.10,01,116లు, ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్కు రూ.10,01,116లు విరాళం ఇచ్చారు. ఈసందర్భంగా
ఆనంద్మోహన్ను తితిదే ఛైర్మన్ అభినందించారు.