Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 ప్లే ఆఫ్స్ వేదికలను బీసీసీఐ ఖరారు చేసింది. ముల్లాన్పుర్, అహ్మదాబాద్లో నాలుగు ప్లే ఆఫ్స్ మ్యాచ్లు నిర్వహించనున్నారు. మే 29న జరిగే క్వాలిఫయర్ 1, మే 30న
జరగనున్న ఎలిమినేటర్ మ్యాచ్లకు ముల్లాన్పుర్ ఆతిథ్యమిస్తుంది. క్వాలిఫయర్ 2 (జూన్ 1), ఫైనల్ (జూన్ 3) అహ్మదాబాద్లో జరుగుతాయి. ఈ మేరకు బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. గుజరాత్ టైటాన్స్, రాయల్
ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. మిగిలిన ఒక్క బెర్తు కోసం ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ పోటీపడుతున్నాయి. ఆర్సీబీ మ్యాచ్ లఖ్నవూలో మే 23న
బెంగళూరు వేదికగా ఆర్సీబీ, సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగాల్సి ఉంది. మ్యాచ్కు వర్షం ముప్పు ఉంది. దీంతో ఈ మ్యాచ్ను లఖ్నవూకు తరలించారు. హైదరాబాద్తో మ్యాచ్ తర్వాత ఆర్సీబీ మే 27న లఖ్నవూ
వేదికగానే ఎల్ఎస్జీతో తలపడనుంది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్తో మ్యాచ్ను కూడా అక్కడికి తరలించారు.