Play all audios:
లఖ్నవూ: ఐపీఎల్ (IPL) 2025లో నేటితో లీగ్ దశ ముగియనుంది. లీగ్ స్టేజ్లో చివరి మ్యాచ్లో లఖ్నవూ సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. లఖ్నవూ ఇప్పటికే ప్లే ఆఫ్స్కు
దూరమవగా.. ఈ మ్యాచ్లో ఓడితే బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఆర్సీబీ గెలిస్తే క్వాలిఫయర్- 1లో పంజాబ్తో తలపడుతుంది. ఈ కీలక మ్యాచ్లో బెంగళూరు బౌలర్లు విఫలమవడంతో టాస్ ఓడి
బ్యాటింగ్కు దిగిన లఖ్నవూ భారీ స్కోరు చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఈ సీజన్లో పేలవ ప్రదర్శన చేసిన కెప్టెన్ రిషభ్ పంత్ (118*; 61 బంతుల్లో 11 ఫోర్లు, 8
సిక్స్లు) లీగ్ చివరి మ్యాచ్లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. 29 బంతుల్లో అర్ధ శతకం, 54 బంతుల్లో సెంచరీ అందుకున్నాడు. మిచెల్ మార్ష్ (67; 37 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్లు) హాఫ్ సెంచరీతో
చెలరేగాడు. ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్కే (14) త్వరగానే నిష్క్రమించగా.. మార్ష్, పంత్ రెండో వికెట్కు 78 బంతుల్లో 152 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. నికోలస్ పూరన్ (13) పరుగులు చేశాడు. బెంగళూరు
బౌలర్లలో నువాన్ తుషార, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెఫర్డ్ తలో వికెట్ పడగొట్టారు.