Play all audios:
హైదరాబాద్: భాజపా ఎదుగుదలను ఆపాలని కుట్రలు పన్నుతున్నారని ఆ పార్టీ ఎంపీ రఘునందన్రావు (Raghunandan rao) ఆరోపించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా
భారాస ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందించారు. ‘‘చిట్చాట్లు ఎందుకు?.. ధైర్యముంటే ప్రెస్మీట్లు పెట్టండి. తప్పుడు వార్తలు రాయిస్తున్నారని చెప్పడం ఎందుకు? భారాసతో
మా పార్టీ అధిష్ఠానం ఎప్పుడూ మాట్లాడలేదు. లేనిపోని పంచాయితీలు ఎందుకు?.. కుండ బద్ధలు కొట్టినట్లు చెప్పండి. చిట్చాట్ల పేరుతో మా పార్టీని వివాదంలోకి లాగొద్దని కవితకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ
సొంత పంచాయితీలు మీరే తేల్చుకోండి.. మమ్మల్ని లాగొద్దు. తెరాస (ప్రస్తుతం భారాస) గతంలో అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుంది. 2004లో కాంగ్రెస్తో తెరాస పొత్తు పెట్టుకుంది. 2009లో మహా కూటమి పేరుతో
పలు పార్టీలతో పొత్తు పెట్టుకుంది. 2014లో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామన్నది ఎవరు? భారాసతో భాజపా ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా? హరీశ్ కోవర్టు అయితే ఎందుకు సస్పెండ్ చేయలేదు? రాష్ట్రంలో
భాజపా బలం పుంజుకుంటోంది.. కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోంది. పార్లమెంటు ఎన్నికల్లో భారాస ఒక్క సీటూ గెలవలేదు. ఆ పార్టీ చెల్లని రూపాయిగా మారిందని ప్రజలు భావిస్తున్నారు. భాజపా,
భారాస ఒక్కటనే తప్పడు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు, కవిత చెల్లని రూపాయి అయ్యారు. పదేళ్ల పాలనలో అమరుడు శ్రీకాంత్చారి కుటుంబానికి ఏమీ దక్కలేదు. తెలంగాణ ఉద్యమంలో అసువులు
బాసిన 1200 మంది అమరులను పట్టించుకోలేదు. కేసీఆర్ కుటుంబం పదేళ్లు దోచుకుంది. హరీశ్రావు భాజపా కోవర్టు అయితే మంత్రివర్గం నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదు? భారాస బలహీనపడాలి అనుకునేవాళ్లే కవిత వెనక
ఉన్నారు. ఆమె కొత్త పార్టీ పెడుతోందని నాకు సమాచారముంది. భారాసకు అభ్యర్థులు లేక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కోవర్టు పని చేసే వాళ్లు భాజపాలో ఉండరు’’ రఘునందన్రావు వ్యాఖ్యానించారు.
(Telangana News)