Gaza: మానవతా సహాయ కేంద్రం వద్ద ఇజ్రాయెల్‌ దాడులు.. గాజాలో 30 మంది మృతి

Gaza: మానవతా సహాయ కేంద్రం వద్ద ఇజ్రాయెల్‌ దాడులు.. గాజాలో 30 మంది మృతి

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: గాజా (Gaza)పై ఇజ్రాయెల్‌ దాడులను తీవ్రతరం చేస్తోంది. తాజాగా ఆదివారం గాజాలోని రఫాపై టెల్‌అవీవ్‌ భీకర దాడులు చేసింది. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు (Israel-Hamas). 


అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రఫాలో గాజా హ్యుమానిటేరియన్‌ ఫౌండేషన్‌ (GHF) మానవతా సహాయ పంపిణీ కేంద్రం సమీపంలో ఈ దాడులు జరిగాయి. ఘటన సమయంలో వేలాది మంది పాలస్తీనియన్లు మానవతా సాయం


తీసుకోవడం కోసం అక్కడ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్‌ దాడులు జరిపింది. ఇందులో 30 మంది మృతి చెందగా.. 115 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటపై


హమాస్‌ స్పందిస్తూ.. మానవతా సాయం అందించే పేరుతో ఆకలితో అలమటిస్తున్న పౌరులపై ఇజ్రాయెల్‌ దళాలు సామూహిక హత్యలకు పాల్పడ్డాయని ఆరోపించింది. దీనిపై టెల్‌అవీవ్‌ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. 


కాగా.. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణకు హమాస్ అంగీకరించిన కొద్ది గంటల్లోనే ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.  * హమాస్‌ స్పందన ఆమోదయోగ్యం కాదు.. అమెరికా ప్రతినిధి విట్కాఫ్ 2023 అక్టోబరు


నుంచి ఇజ్రాయెల్‌- హమాస్‌ల మధ్య జరుగుతున్న పోరులో గాజాలో 54 వేల మంది ప్రాణాలు కోల్పోయారని స్థానిక యంత్రాంగం వెల్లడించింది. ఇటీవల మానవతా సాయాన్ని పరిమితంగా అందించేందుకు ఇజ్రాయెల్‌


అనుమతిచ్చింది. అయితే, ఇది అక్కడి ప్రజలకు ఏమాత్రం సరిపోదనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే అమెరికా 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రతిపాదించింది. దీనికి ఇజ్రాయెల్‌ ఇప్పటికే


అంగీకరించగా.. హమాస్ కూడా ఒప్పకుంది. అయితే, కాల్పుల విరమణకు సంబంధించి కొన్ని సవరణలను మాత్రం సూచించింది.