Play all audios:
ఇంటర్నెట్డెస్క్: న్యూయార్క్ (New York)లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి వెళ్తున్న ట్విన్ ఇంజిన్ విమానం ఒక పొలంలో కుప్పకూలింది. కొలంబియా కౌంటీ
అండర్షెరీఫ్ జాక్వెలిన్ సాల్వటోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ విమాన ప్రమాదానికి సంబంధించి మృతుల వివరాలను ఆమె వెల్లడించలేదు. అయితే, ప్రమాద సమయంలో విమానంలో ఇద్దరు ఉన్నట్లు తెలుస్తోంది.
మిత్సిబిషి ఎమ్యూ-2బీ విమానం కొలంబియాలోని కౌంటీ విమానాశ్రయానికి బయలుదేరింది. కోపాకేకు 30 మైళ్ల దూరంలో ఉండగానే ఒక పొలంలో కుప్పకూలింది. వాతావరణ పరిస్థితుల కారణంగా సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి
చేరుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. ఇక, ఇటీవల న్యూయార్క్లో ఓ పర్యటక హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి
తెలిసిందే. జర్మనీకి చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీ సీమెన్స్ కంపెనీ స్పెయిన్ విభాగ అధిపతి, సీఈఓ అగస్టన్ ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి హడ్సన్ నది మీదుగా వెళ్తున్న సమయంలో ఆ హెలికాప్టర్
నదిలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలతో సహా హెలికాప్టర్ పైలట్ సైతం మృతి చెందారు.