Play all audios:
Australia | ఇంటర్నెట్డెస్క్: ఆస్ట్రేలియాలోని న్యూసౌత్ వేల్స్లో భారీగా వరదలు వచ్చాయి. వీటిల్లో దాదాపు 50 వేల మందికి పైగా చిక్కుకుపోయారు. దీనిని ప్రకృతి విపత్తుగా అక్కడి ప్రభుత్వం
ప్రకటించింది. ఈ స్థాయిలో వర్షాలను ఇటీవల కాలంలో చూడలేదని స్థానికులు చెబుతున్నారు. భారీ వర్షాల కారణంగా సిడ్నీ, న్యూకాస్టలె తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. ఇక న్యూసౌత్ వేల్స్ దక్షిణ ప్రాంతంలో
కూడా భారీ వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనెస్ పర్యటించారు. తాము మరింత తీవ్రమైన వాతావరణ పరిస్థితులను చూస్తున్నామని
చెప్పారు. బాధితులు ఒంటరి వారు కాదని.. వారి వెంటే తాము ఉన్నట్లు వెల్లడించారు. అత్యవసర సహాయ సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ వరదల సందర్భంగా ఆ రాష్ట్ర అత్యవసర సేవల సంస్థ 24 గంటల్లో 535
మందిని కాపాడింది. భారీ వర్షాల కారణంగా వేల ఇళ్లకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పునరావాస కేంద్రాలను తెరిచారు. ఈ వరదలకు టారే అనే పట్టణం తీవ్రంగా ప్రభావితమైంది. అక్కడ ఉన్న నది 20.6 అడుగుల
ఎత్తున ప్రవహిస్తోంది. గతంలో ఎన్నడూ వరదనీరు ఈ స్థాయికి చేరుకోలేదు.