Play all audios:
అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి వేగంగా అడుగులు పడుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కూటమి ప్రభుత్వం పాలసీలతో పెట్టుబడులకు దేశ, విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. ఇప్పటి
వరకు ఆరు ఎస్ఐపీబీల్లో 76 ప్రాజెక్టుల ద్వారా రూ.4,95,796 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని వీటి ద్వారా 4,50,934 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఒప్పందాలు చేసుకున్న
సంస్థల పనుల పురోగతిపై డాష్ బోర్డు ద్వారా పర్యవేక్షణ జరగాలన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ ఎస్ఐపీబీ సమావేశం ముగిసింది. 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ.33వేల కోట్ల పెట్టుబడుల
ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. దాదాపు 35 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే పెట్టుబడులకు సమావేశంలో ఆమోదం లభించింది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖలకు సంబంధించి పెట్టుబడులు
పెట్టేందుకు వివిధ సంస్థలు ముందుకువచ్చాయి.రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముందుకొచ్చి ఒప్పందాలు చేసుకున్న సంస్థలకు సంబంధించి... ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అధికారులు నిరంతర
పర్యవేక్షణ జరపాలని సూచించారు. ప్రతి ప్రాజెక్టు పురోగతిని నిరంతరం ఫాలోఅప్ చేయాలన్నారు. ఆయా సంస్థల పెట్టుబడులు, క్షేత్రస్థాయి పనుల స్థితిగతులను తెలుసుకునేందుకు డాష్ బోర్డు తీసుకురావాలని
అధికారులను ఆదేశింంచారు. టూరిజం సెక్టార్లో హోటళ్లు, గదుల కొరత ఉందన్న ముఖ్యమంత్రి.. పెద్దఎత్తున హొటల్ రూమ్లు వస్తే పర్యాటకానికి ఊపు వస్తుందని వ్యాఖ్యానించారు. 50 వేల రూమ్లు అందుబాటులోకి
తేవాలి అనేది తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. హోటల్ రూమ్ల ధరలు అందుబాటులో ఉంటే పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో బస చేస్తారని వెల్లడించారు.