Play all audios:
అవినీతి, ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఏపీ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. పులివెందుల: అవినీతి, ఫ్యాక్షన్, హత్యా రాజకీయాలకు పాల్పడిన వారిపై
కఠిన చర్యలు తప్పవని ఏపీ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. కడప జిల్లా పులివెందులలో చీఫ్ విప్ ఆంజనేయులతో కలిసి పార్టీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. మహానాడు వసతుల ఏర్పాటుపై నేతలకు దిశా
నిర్దేశం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా నాయకుల హత్యను ఇరువురు నేతలు తీవ్రంగా ఖండించారు. హంతకులను వదిలిపెట్టబోమన్నారు. కడప మహానాడుతో తెదేపా కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోందని జీవీ
అంజనేయులు అన్నారు. గత వైకాపా ప్రభుత్వం ఫ్యాక్షన్, అవినీతి తప్ప ప్రజలకు చేసింది శూన్యమని ఆరోపించారు. జగన్ పాలనలో కడప, పులివెందులలో కొత్తగా ఎకరానికైనా నీళ్లిచ్చారా? అని ప్రశ్నించారు.
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు.