Play all audios:
IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నాలుగో సారి ఫైనల్కు చేరుకుంది. తొలి క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్ను చిత్తు చేసింది. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్ (IPL) ఫైనల్కు రాయల్
ఛాలెంజర్స్ బెంగళూరు దూసుకెళ్లింది. ఐపీఎల్లో నాలుగో సారి ఇలా తుది పోరుకు వెళ్లింది. మొదటి క్వాలిఫయర్లో పంజాబ్ కింగ్స్పై బెంగళూరు ఘన విజయం సాధించింది. ఐపీఎల్ నాకౌట్ చరిత్రలోనే
(బంతులపరంగా) అత్యంత భారీ గెలుపు ఇదే కావడం గమనార్హం. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 101 పరుగులకే ఆలౌట్ కాగా.. బెంగళూరు 10 ఓవర్లలోనే రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి అలవోగా విజయం సాధించింది. ఈ
మ్యాచ్లో నమోదైన రికార్డులు, విశేషాలు ఇవీ.. * అత్యంత వేగంగా 100+ టార్గెట్ను పూర్తి చేయడం ఇది మూడో సారి. 10 ఓవర్లలోనే పంజాబ్పై బెంగళూరు గెలిచింది. అంతకుముందు 2015లో కేకేఆర్పై ఆర్సీబీనే 9.4
ఓవర్లలోనే 112 పరుగుల టార్గెట్ను ఛేదించింది. * బంతులపరంగా ఐపీఎల్ ప్లేఆఫ్స్ / నాకౌట్ పోరులో భారీ విజయం నమోదు చేసిన జట్టుగా బెంగళూరు (Pbks vs RCB) నిలిచింది. పంజాబ్పై 60 బంతులు మిగిలి
ఉండగానే గెలిచింది. అంతకుముందు 2024 సీజన్ ఫైనల్లో సన్రైజర్స్పై కోల్కతా 57 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. * ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్కు చేరుకుంది. 2009, 2011,
2016లో టైటిల్ పోరుకు వెళ్లినా.. ఒక్క కప్నూ దక్కించుకోలేదు. ఇప్పుడు నాలుగోసారి ఫైనల్కు దూసుకెళ్లింది. * క్వాలిఫయర్ 1లో విజేతగా నిలిచిన జట్టే అత్యధికసార్లు టైటిల్ను సొంతం చేసుకోవడం
గమనార్హం. 2011లో ప్లేఆఫ్స్ పద్ధతి ప్రారంభం తర్వాత నుంచి 14 ఎడిషన్లలో 11 సార్లు క్వాలిఫయర్ -1 గెలిచిన జట్టే ఛాంపియన్ అయింది. * ఆర్సీబీ ఆటగాడు సుయాశ్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
సొంతం చేసుకున్నాడు. ఇలా ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున ఈ అవార్డును అందుకొన్న తొమ్మిదో ప్లేయర్ కావడం గమనార్హం. ఇక ఈ సీజన్లో అత్యంత వేగంగా పూర్తయిన మ్యాచ్ ఇదే. మొత్తం 24.1 ఓవర్లలోనే ముగిసింది.