Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: గాజాపై ఇజ్రాయెల్ (Israel-Hamas) చేస్తున్న వరుస భీకర దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ఈ క్రమంలో గాజాలోని 10 లక్షల మంది పాలస్తీనియన్లను శాశ్వతంగా లిబియాకు పంపించడానికి
ట్రంప్ (Donald Trump) యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విషయంపై లిబియా (Libya) నాయకత్వంతోను యూఎస్ సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఇందుకు లిబియా
అంగీకరిస్తే బదులుగా అమెరికా బిలియన్ డాలర్ల నిధులు విడుదల చేస్తుందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. గాజాలోని పాలస్తీనియన్లు ఖాళీ చేయాలని గతంలో ప్రతిపాదించిన ట్రంప్ తాజాగా పశ్చిమాసియా
పర్యటనలో భాగంగా మాట్లాడారు. గాజాను అమెరికా అధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పునరుద్ఘాటించిన రెండు రోజుల అనంతరం ఈ ప్రకటన వెలువడింది. ఈ విషయంపై ఇంకా అమెరికా- లిబియాల మధ్య తుది ఒప్పందం
కుదరలేదని.. ఇరుదేశాల మధ్య చర్చల గురించి ఇజ్రాయెల్కు ట్రంప్ తెలియజేశారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా దీనిపై యూఎస్ ప్రభుత్వ ప్రతినిధి మాట్లాడుతూ ఈ నివేదికలు అవాస్తవమన్నారు.
పాలస్తీనియన్లను తరలించే పరిస్థితి లిబియాలో లేదని అన్నారు. గాజాలో ఉద్రిక్తతల వల్ల నిరాశ్రయులుగా మారిన పాలస్తీనీయులకు (Palestinians) అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలని ట్రంప్ గతంలో
ప్రతిపాదించినప్పటికీ.. ఆ దేశాలు దానిని వ్యతిరేకించాయని తెలిపారు. అమెరికా గాజాను స్వాధీనం చేసుకోవాలనుకుంటుందని ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ అనేకసార్లు పేర్కొన్నారు. గాజాను అమెరికా స్వాధీనం
చేసుకొని.. ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తుందని అన్నారు. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే.. అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు కల్పించవచ్చని తెలిపారు. తాజాగా పశ్చిమాసియా
పర్యటనకు వెళ్లిన ట్రంప్ మళ్లీ పాత పాటే పాడారు. ‘‘గాజా ఫొటోలను చూశాను. అక్కడ ఒక్క భవనమూ లేదు. అన్నీ కుప్పకూలాయి. ఆ శిథిలాల కిందే ప్రజలు ఉంటున్నారు. ఇది అంగీకారయోగ్యం కాదు. గాజాను అమెరికా
తీసుకోవాలని అనుకుంటున్నాను. స్వేచ్ఛా మండలంగా దాన్ని మలచాలి. గాజాకు సంబంధించి నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి’’ అని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్కు మైక్రోసాఫ్ట్ ఏఐ టెక్నాలజీ.. గాజా ప్రజలకు కీడు
జరగలేదన్న కంపెనీ మైక్రోసాఫ్ట్ అందించిన ఏఐ టెక్నాలజీని ఇజ్రాయెల్ గాజా ప్రజలకు హాని తలపెట్టడానికి వినియోగించిందని వస్తున్న ఆరోపణలపై మైక్రోసాఫ్ట్ కంపెనీ స్పందించింది. గాజా యుద్ధ సమయంలో
ఇజ్రాయెల్ సైన్యానికి అధునాతన ఏఐ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను విక్రయించామని.. బందీలను గుర్తించడం, వారిని రక్షించడానికి మాత్రమే వీటిని ఇజ్రాయెల్కు అందించామని తెలిపింది. ఇప్పటివరకు
ఆ టెక్నాలజీ, అజూర్ ప్లాట్ఫామ్లను గాజా ప్రజలకు హాని తలపెట్టడానికి వినియోగించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.