Play all audios:
జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరంలో సరస్వతి పుష్కరాలు ఘనంగా సాగుతున్నాయి. నేటితో పుష్కరాలు ముగియనున్నాయి. దీంతో చివరి రోజైన సోమవారం భక్తుల రద్దీ నెలకొంది. పవిత్ర త్రివేణి సంగమంలో భక్తులు
పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. అనంతరం కాళేశ్వర ముక్తేశ్వరస్వామిని దర్శించుకుంటున్నారు. నేడు ముగింపు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో సరస్వతి నది పుష్కరాలు
మే 15న ప్రారంభమైన సంగతి తెలిసిందే. (Telangana News)