Corona virus: మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఐసీఎంఆర్‌ చీఫ్‌ ఏమన్నారంటే?

Corona virus: మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు.. ఐసీఎంఆర్‌ చీఫ్‌ ఏమన్నారంటే?

Play all audios:

Loading...

దిల్లీ: దేశంలో మళ్లీ కొవిడ్‌ కేసులు(Covid 19) కలకలం రేపుతున్నాయి. గత వారం రోజులుగా కేరళ, మహారాష్ట్ర, దిల్లీ, గుజరాత్‌, తమిళనాడు, కర్ణాటకలాంటి పలు రాష్ట్రాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ


నేపథ్యంలో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ICMR) డైరెక్టర్ జనరల్‌ డాక్టర్‌ రాజీవ్‌ బహల్‌ కీలక సూచనలు చేశారు. కరోనా కొత్త వేరియంట్ల పట్ల భయాందోళనలు అవసరం లేదన్నారు. ప్రజలంతా


అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ప్రభుత్వం, ఇతర ఏజెన్సీలు ప్రస్తుత పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయని తెలిపారు. తన అభిప్రాయం ప్రకారం ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం


అవసరమని పేర్కొన్నారు.  ఎవరైనా క్యాన్సర్‌ రోగులు, రోగనిరోధక శక్తి సంబంధిత సమస్యలు ఉన్నవారైతే.. ఎలాంటి ఇన్ఫెక్షన్‌ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.  * పాక్‌ ద్వేషంతో


బతుకుతోంది.. ఎప్పుడూ అదే ఆలోచన: ప్రధాని మోదీ ఫైర్‌ రాష్ట్రాల వారీగా కొవిడ్‌ కేసులు ఇలా.. దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 1009గా ఉండగా.. వారం వ్యవధిలో 750 మందికి కొత్తగా కరోనా సోకిందని


సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.  డేటాబోర్డులో వెల్లడించిన సమాచారం ప్రకారం..  ఈ ఉదయం 8గంటల వరకు రాష్ట్రాల వారీగా కొవిడ్‌ యాక్టివ్‌ కేసుల వివరాలు పరిశీలిస్తే.. కేరళలో


అత్యధికంగా 430 క్రియాశీల కేసులు ఉండగా.. మహారాష్ట్ర (209), దిల్లీ (104), గుజరాత్‌ (83), తమిళనాడు (69), కర్ణాటక (47), ఉత్తరప్రదేశ్‌ (15), రాజస్థాన్‌ (13), పశ్చిమబెంగాల్‌ 12, పుదుచ్చేరి 9,


హరియాణా 9, ఏపీ 4, మధ్యప్రదేశ్‌ 2, తెలంగాణ, గోవా, ఛత్తీస్‌గఢ్‌లలో ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.