Play all audios:
పశ్చిమబెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ‘ తీస్తా ప్రహార్’ పేరుతో ఇండియన్ ఆర్మీ భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. ఇంటర్నెట్డెస్క్: భారత్-పాకిస్థాన్ (India-Pakistan)
మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఇండియన్ ఆర్మీ (Indian Army) సర్వసన్నద్ధమవుతోంది. ఓ వైపు దౌత్య మార్గాల్లో దాయాదికి ఉచ్చు బిగిస్తున్న భారత్.. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దీటుగా
బదులిచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ‘ తీస్తా ప్రహార్’ పేరుతో భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టింది. నదీ తీర ప్రాంతంలో యుద్ధం
సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి? శత్రువు వ్యూహాలను ఎలా తుత్తునియలు చేయాలన్న దానిపై కసరత్తు చేసింది. ఆయుధ సరఫరా, సైనికుల మధ్య సమన్వయం తదితర అంశాలను క్షేత్ర స్థాయిలో పరీక్షించింది. ఈ మేరకు రక్షణ శాఖ
ఓ ప్రకటన విడుదల చేసింది. ఇటీవల భారత సైన్యంలోకి అత్యాధునిక సాంతకేతిక వ్యవస్థ, ఆయుధాలు వచ్చి చేరాయి. ఈ క్రమంలో వాటిని వినియోగించడం, సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలపై ఈ విన్యాసాల్లో ప్రధానంగా
దృష్టిసారించారు. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలన్నదానిపై సైన్యం కసరత్తు చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో వేగంగా, సమర్థంగా లక్ష్యాలను ఛేదించడంపై రిహార్సల్స్
చేశారు. శత్రువుల నుంచి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి అప్పటికప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై సైనిక విన్యాసాలు నిర్వహించారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ ఓ వీడియోను విడుదల చేసింది.