Play all audios:
ITR filing date | ఇంటర్నెట్ డెస్క్: ఆదాయపు పన్ను రిటర్నుల దాఖలు విషయంలో ఐటీ విభాగం (Income tax department) కీలక నిర్ణయం తీసుకుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్ను రిటర్నుల
దాఖలు గడువును పొడిగించింది. 2025 జులై 31తో గడువు ముగియనుండగా.. సెప్టెంబర్ 15 వరకు పన్ను చెల్లింపుదారులకు అవకాశం కల్పించింది. ఐటీఆర్ ఫారాల నోటిఫికేషన్ జారీ ఆలస్యం నేపథ్యంలో ఈ నిర్ణయం
తీసుకుంది. ‘‘2025-26 మదింపు సంవత్సరానికి నోటిఫై చేసిన ఐటీఆర్ ఫారాల్లో చేపట్టిన మార్పులకు అనుగుణంగా సిస్టమ్ను సిద్ధం చేయడానికి కొంత గడువు పడుతుంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా రిటర్నులు ఫైల్
చేయడం కోసం జులై 31తో ముగియనున్న గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగిస్తున్నాం’’ అని ఆదాయపు పన్ను శాఖ ఎక్స్లో పోస్ట్ పెట్టింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ వేరేగా విడుదల చేస్తామని
పేర్కొంది.