Rbi: రూ. 6,181 కోట్లు విలువైన రూ. 2,000 నోట్లు ఇంకా రాలేదు..

Rbi: రూ. 6,181 కోట్లు విలువైన రూ. 2,000 నోట్లు ఇంకా రాలేదు..

Play all audios:

Loading...

RBI | ఇంటర్నెట్‌డెస్క్‌: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2,000 నోట్లను మార్కెట్‌ నుంచి వెనక్కి తీసుకొన్నా.. అవి పూర్తి స్థాయిలో తిరిగి రాలేదు. ఇంకా ఆర్థిక వ్యవస్థలో రూ.6,181 కోట్లు విలువైన


నోట్లు ఇంకా ఆర్థిక వ్యవస్థలోనే ఉన్నట్లు ఆర్‌బీఐ సోమవారం విడుదల చేసిన డేటాలో పేర్కొంది. కాకపోతే జారీ చేసిన రూ.2,000 నోట్లలో 2023 మే 19 నాటికి చలామణిలో ఉన్న 98.26శాతం నోట్లు తిరిగి మా వద్దకు


తిరిగి వచ్చాయి’’ అని ఆర్‌బీఐ పేర్కొంది.  అదే రోజు 2,000 నోట్లను మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకొన్న విషయం తెలిసిందే. 2025 మే 31 నాటికి ఆర్థిక వ్యవస్థలో ఇంకా రూ.6,181 కోట్లు విలువైన నోట్లు


ఉన్నాయని పేర్కొంది. ఈ నోట్లను 2023 అక్టోబర్‌ 7వ తేదీ వరకు బ్యాంక్‌లో మార్చుకోవడానికి లేదా డిపాజిట్‌ చేయడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఆ తర్వాత నుంచి వీటిని దేశంలోని 19 ఆర్‌బీఐ ఇష్యూ


ఆఫీసుల్లో మాత్రమే మార్చుకోవడానికి అవకాశం ఉంది. 2023 అక్టోబర్‌ 9 నుంచి ఆర్‌బీఐ ఇష్యూ ఆఫీసుల్లో వీటిని స్వీకరించడం మొదలుపెట్టారు. వీటిని వ్యక్తులు, సంస్థల పేరిట నేరుగా ఖాతాల్లో డిపాజిట్‌


చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీంతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న పోస్టాఫీసుల నుంచి కూడా ప్రజలు ఈ నోట్లను ఆర్‌బీఐకి పంపించి.. తమ ఖాతాల్లో నగదు క్రెడిట్‌ చేయించుకొనే అవకాశం కల్పించింది.