Stock market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Stock market: ఫ్లాట్‌గా ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్లు

Play all audios:

Loading...

Stock Market Opening Bell | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను మొదలుపెట్టిన


సూచీలు ప్రస్తుతం స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ (Sensex) 138 పాయింట్ల లాభంతో 82,171 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ (Nifty) 27 పాయింట్ల లాభంతో 24,973 వద్ద


ఉన్నాయి.  సెన్సెక్స్‌ 30 సూచీలో.. టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, ఎటర్నల్‌, టీసీఎస్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, అదానీ పోర్ట్స్‌, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌


బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టాటా మోటార్స్‌, నెస్లే


ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ 65.49 డాలర్ల వద్ద.. బంగారం ఔన్సు 3,216


డాలర్ల వద్ద ట్రేడవుతోంది. * ఫండ్లలోనూ ‘రాణి’స్తున్నారు లాస్ట్‌ ట్రేడింగ్‌ సెషన్‌లో అమెరికా మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. ఎస్‌ అండ్‌ పీ 500.. 0.09 శాతం, డోజోన్స్ 0.32 శాతం, నాస్‌డాక్ 0.02


శాతం లాభంతో ముగిశాయి. ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఆస్ట్రేలియన్‌ ఏఎస్‌ఎక్స్‌ 0.42 శాతం, జపాన్‌ నిక్కీ 0.51 శాతం, షాంఘై 0.26 శాతం, హాంగ్‌సెంగ్‌ 1.18 శాతం లాభంతో


కదలాడుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) సోమవారం నికరంగా రూ.526 కోట్ల విలువ చేసే షేర్లను విక్రయించారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.238 కోట్ల షేర్లును విక్రయించారు.