Play all audios:
బెయిల్పై బయటకు వచ్చే డ్రగ్ స్మగ్లర్ల కదలికలను గుర్తించేందుకు గాను వారి కాళ్లకు జీపీఎస్ ఆధారిత చైన్లను అమర్చేందుకు పంజాబ్ పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. చండీగఢ్: మాదకద్రవ్యాల ముఠాల
ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నట్లు పంజాబ్ పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలో బెయిల్పై బయటకు వచ్చే డ్రగ్ స్మగ్లర్ల కదలికలను గుర్తించేందుకు గాను వారి కాళ్లకు జీపీఎస్
ఆధారిత చైన్లను అమర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే జమ్మూ కశ్మీర్ పోలీసులు ఈ తరహా చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ‘‘చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసుల్లో
నిందితులపై నిఘా పెట్టేందుకు జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రత్యేక డివైజ్లను ఉపయోగిస్తున్నారు. ఇటువంటి ప్రతిపాదనను న్యాయకోణంలో పరిశీలిస్తున్నాం. తీవ్ర నేరాభియోగాలు ఎదుర్కొంటూ.. బెయిల్పై బయటకు
వచ్చిన తర్వాత నిందితుల కదలికలను గమనించేందుకు వారి పాదాలకు జీపీఎస్ ఆధారిత చైన్లను అమర్చుతాం’’ అని పంజాబ్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ పేర్కొన్నారు. * అమెరికా స్కూల్లో.. తల్లిదండ్రుల
ముష్టిఘాతాలు! గోప్యతా హక్కును దృష్టిలో ఉంచుకొని తగు చర్యలు తీసుకుంటామని పంజాబ్ డీజీపీ పేర్కొన్నారు. గ్రామ పెద్దలు, పంచాయతీలను పరిగణనలోకి తీసుకొని ఈ పర్యవేక్షణ వ్యవస్థను రూపొందించామన్నారు.
జిల్లాల్లో మాదకద్రవ్యాల స్మగ్లింగ్కు పాల్పడుతూ అరెస్టయ్యే వారి సమాచారాన్ని సేకరించేందుకు ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తామని చెప్పారు.