Play all audios:
రెండ్రోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు వెల్లడించాయి. వీటిల్లో థ్రాల్లో జరిగిన ఆపరేషన్లో ప్రజల ప్రాణాలు కాపాడేందుకు శ్రమించినట్లు పేర్కొంది. Indian
Army || ఇంటర్నెట్డెస్క్: 48 గంటల వ్యవధిలో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసులతో కలిసి ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. మార్చిలో అమాయకుల ప్రాణాలు తీసిన ఓ టెర్రరిస్టు కూడా వీరిలో ఉన్నట్లు
మీడియా సమావేశంలో జీవోసీ వి-ఫోర్స్ మేజర్ జనరల్ ధనుంజయ జోషీ, ఐజీపీ కశ్మీర్ వీకే బిర్డి పాల్గొని వివరాలు వెల్లడించారు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కొన్నా ఏరి వేస్తామని చెప్పారు. ‘‘మే 12వ తేదీన
కెలర్ పర్వత శిఖరాల వద్ద ఉగ్ర బృందాలు దాక్కొని ఉన్నట్లు మాకు విశ్వసనీయ సమాచారం వచ్చింది. మర్నాడు ఉదయమే అక్కడ అనుమానాస్పద కదలికలను గుర్తించాము. దీంతో భద్రతా దళాలు వారిని చుట్టుమట్టాయి. వారు
కాల్పులు జరపడంతో ఎన్కౌంటర్లో వారిని మట్టుబెట్టాయి’’ ‘‘ఇక థ్రాల్ పరిసరాల్లోని సరిహద్దు గ్రామంలో రెండో ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ మేము నిర్బంధ తనిఖీలు చేపట్టాం. ఉగ్రవాదులు వేర్వేరు ఇళ్లలో
దాక్కొని కాల్పులు మొదలు పెట్టారు. ప్రజల ప్రాణాలను రక్షించడం ఇక్కడ మాకు సవాలుగా మారింది. కానీ, ఎట్టకేలకు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఈ రెండు ఎన్కౌంటర్లలో మృతి చెందిన ఆరుగురిలో ఒకడైన
షహిద్ కుట్టె రెండు పెద్ద దాడుల్లో నిందితుడు. జర్మనీ పర్యాటకులపై కూడా ఇతడు దాడి చేశాడు. థ్రాల్ ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు కూడా చాలా కఠినంగా ఉన్నాయి’’ అని మేజర్ జనరల్ ధనుంజయ జోషీ
పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లలో జమ్మూకశ్మీర్ పోలీస్, సైన్యంతోపాటు సీఆర్పీఎఫ్ దళాలు కూడా పాల్గొన్నాయి.