Play all audios:
Supreme Court: మహిళలు రఫేల్ యుద్ధ విమానాలే నడుపుతున్నప్పుడు.. సైన్యంలోని లీగల్ బ్రాంచీల్లోకి వాళ్లను ఎందుకు తీసుకోవడం లేదని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దిల్లీ: భారత సైన్యంలోని
జడ్జి అడ్వొకేట్ జనరల్ (లీగల్) బ్రాంచీ పోస్టుల్లో మహిళా అధికారులు తక్కువగా ఉండటంపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆ పోస్టులకు స్త్రీ-పురుష నిష్పత్తి వర్తించదని నిబంధన ఉన్నప్పటికీ
కేంద్రం ఎందుకు అనుసరించడం లేదని అడిగింది. రఫేల్ లాంటి అత్యాధునిక యుద్ధ విమానాలనే అమ్మాయిలు నడుపుతున్నప్పుడు.. లీగల్ పోస్టులు ఎందుకు ఇవ్వడం లేదని అత్యున్నత న్యాయస్థానం (Supreme Court)
ప్రశ్నించింది. సైన్యం (Indian Army)లోని జడ్జి అడ్వొకేట్ జనరల్ లీగల్ పోస్టుల కోసం జరిగిన పరీక్షల్లో అష్నూర్ కౌర్, ఆస్థ త్యాగీ అనే మహిళా అధికారులు వరుసగా 4, 5వ ర్యాంకులు సాధించారు.
అయినప్పటికీ వీరిని విధుల్లోకి తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పురుష అభ్యర్థులకన్నా తమకు మెరిట్ ఎక్కువగా ఉనప్పటికీ.. మహిళల కోటాల్లో ఖాళీలు లేవంటూ తమను ఎంపిక చేయలేదని ఆవేదన వ్యక్తం
చేశారు. వీరి పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. * నౌకలో 21 మంది పాక్ సిబ్బంది.. ఆ పోర్టులో హైఅలర్ట్! ‘‘భారత వాయుసేనలో మహిళలు రఫేల్ యుద్ధ విమానాలను
నడిపేందుకు అనుమతి ఉన్నప్పుడు.. ఆర్మీలోని లీగల్ బ్రాంచీల్లో పురుషుల కంటే ఎక్కువగా మహిళలను విధుల్లోకి తీసుకోవడంలో కష్టమేముంది? స్త్రీ-పురుష భేదంతో సంబంధం లేకుండా అవి తటస్థ పోస్టులను కేంద్రం
చెప్పినప్పుడు.. మహిళలకు ఎందుకు ఎక్కువ పోస్టులను కేటాయించడం లేదు? స్త్రీ-పురుష సమానత్వం అంటే మహిళలు, పురుషులకు సమాన అవకాశాలు కల్పించడం కాదు. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా అర్హత ఉంటే అవకాశం
ఇవ్వడమే’’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అనంతరం దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది.