Nri news: దోహాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

Nri news: దోహాలో ఘనంగా మినీ మహానాడు, ఎన్టీఆర్‌ జయంతి వేడుకలు

Play all audios:

Loading...

దోహా: ఖతార్‌ రాజధాని నగరం దోహాలో తెదేపా మినీ మహానాడు, తెలుగు ప్రజల కీర్తిని దశ దిశలు వ్యాపింపజేసిన నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా


కోడెల శివరామకృష్ణ హాజరయ్యారు. ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు. మా తెలుగుతల్లికి మల్లెపూదండ గీతాలాపనతో ప్రారంభమైన ఈ సభ ఎంతో ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా ‘తారకరామం’


పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ కేకును ముఖ్యఅతిథి కట్‌ చేసిన అనంతరం అందరికీ పంచారు. ఈ సందర్భంగా కోడెల శివరామకృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ కారణజన్ముడు. తెలుగువారి


ఆత్మ గౌరవం దిల్లీ వీధుల్లో తాకట్టుపెట్టబోతుంటే తట్టుకోలేక, బడుగు బలహీన వర్గాల వారు ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే ఓర్వలేక తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే


అధికారంలోకి తీసుకొచ్చారు. ఆయన ప్రారంభించిన సంక్షేమ పథకాలు, కూడు, గుడ్డ, గూడు, రైతులకు ఉచిత విదుత్ వంటి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. ఎన్టీఆర్‌ ఆశయాలను కొనసాగిస్తూ సీఎం చంద్రబాబు


రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు చేస్తున్న కృషి ప్రపంచానికే ఆదర్శప్రాయం. 1982లో  ఎన్టీఆర్‌ పార్టీ స్థాపించి రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకురావాలనే లక్ష్య సాధనలో విద్యావేత్తలు,


సమాజంలో ఉన్నతమైన వారి కోసం చూస్తున్న తరుణంలో నా తండ్రి కోడెల శివప్రసాద్‌ గురించి తెలుసుకొని తెదేపాలోకి ఆహ్వానించి సముచిత స్థానమిచ్చి గౌరవించారు. కోడెల శివప్రసాద్ కూడా తనొకొచ్చిన అవకాశాన్ని


వినియోగించుకొని ఒకవైపు పార్టీని, కార్యకర్తలని కాపాడుకొంటూ అభివృద్ధి పథంలో సాగేందుకు చేసిన కృషి నేటి తరానికి ఆదర్శప్రాయం. లక్ష మరుగుదొడ్ల నిర్మాణం లిమ్కా బుక్  అఫ్ వరల్డ్ రికార్డ్స్‌తో పాటు


గిన్నిస్ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌లో చోటుదక్కించుకుంది’’ అన్నారు.  తన ప్రాణం ఉన్నంత వరకు తెదేపా కోసమే పనిచేస్తానన్న ఆయన.. కొన్ని కష్టాలొచ్చినప్పుడు పార్టీని మార్చడమంటే అది కన్నతల్లిని మార్చటమేనని  


చెప్పుకొచ్చారు. తన మొబైల్  ఫోన్ నెంబర్ సేవ్ చేసుకొని తనకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చని సూచించారు. అందరికీ  ఫోన్ కాల్ దూరంలోనే ఉంటానన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించిన ఖతార్


కార్యవర్గాన్ని ముఖ్యంగా ఖతార్‌లో ఎన్నారై తెదేపా అధ్యక్షుడు గొట్టిపాటి  రమణయ్య , ఉపాధ్యక్షుడు మద్దిపోటి  నరేష్, జనరల్ సెక్రటరీ  పొనుగుమాటి రవి, జీసీసీ కౌన్సిల్ సభ్యుడు మల్లిరెడ్డి సత్యనారాయణ,


ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ దాసరి రమేష్, సీనియర్  నాయకులు ఎలమంచిలి శాంతయ్య, నరసింహారావు తదితరులను అభినందించారు.  ఈ సందర్బంగా దోహా నుంచి గన్నవరం వరకు నేరుగా విమాన సర్వీసులు ఉండేలా


చొరవతీసుకోవాలని ఆయనకు ఖతార్‌ టీమ్‌ వినతిపత్రం అందించింది. ఎన్నారై తెదేపా ఖతార్‌ అధ్యక్షుడు గొట్టిపాటి రమణయ్య మాట్లాడుతూ.. ‘‘ ఖతార్‌లో ఉన్న వేలాది మంది తెలుగు ప్రవాసీయులకు అత్యవసర


పరిస్థితులు, పండుగల సమయంలో ప్రయోజనకరంగా ఉండేలా దోహా నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు ఏర్పాటు చేయాలని ఏపీ సర్కార్‌, పౌర విమానయాన మంత్రిత్వశాఖను కోరారు. ప్రవాస భారతీయుల సమస్యలు


పరిష్కరించేలా తెదేపా జాతీయ, రాష్ట్ర స్థాయి కమిటీల్లో ఎన్నారై తెదేపా ఖతార్‌కు చురుకైన పాత్ర ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పట్టే పనిలో


తలమునకలైన ఎన్డీయే ప్రభుత్వానికి ప్రతిఒక్కరూ సహకరించాలని ఎన్నారై తెదేపా నేతలు మద్దిపోటి  నరేష్, పొనుగుమాటి రవి, మల్లిరెడ్డి సత్యనారాయణ, దాసరి రమేష్, ఎలమంచిలి శాంతయ్య, దేవినేని పృజ్వల, డాక్టర్


రాధా పత్తిపాటి, ప్రమోద్, మోడీ ఆంజనేయలు, తిరుపాలు, నాని, నాయుడు, పూర్ణచంద్రరావు, అయ్యన్న, కళ్యాణ్, గోపాల్ రాజు  విజ్ఞప్తి చేశారు. అమరావతి రాజధాని కల నెరవేరేదిశగా అడుగులు వేస్తున్న


ప్రజాప్రభుత్వానికి ప్రవాసీయులు సహకరించాలని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చేలా తమ వంతుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.