Iphones: 25% టారిఫ్‌ విధించినా.. భారత్‌లో ‘యాపిల్’ చౌకగానే..

Iphones: 25% టారిఫ్‌ విధించినా.. భారత్‌లో ‘యాపిల్’ చౌకగానే..

Play all audios:

Loading...

iPhones | ఇంటర్నెట్‌ డెస్క్‌: అమెరికాలో ఐఫోన్లు తయారుచేయని పక్షంలో, యాపిల్‌ ఉత్పత్తులపై 25 శాతం సుంకం విధిస్తానని డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి యాపిల్‌ను హెచ్చరించిన విషయం తెలిసిందే.  అయితే


అగ్రరాజ్యం సుంకం విధించినప్పటికీ మన దేశంలో ఐఫోన్ల తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుందని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇన్షియేటివ్‌ (GTRI) తన నివేదికలో వెల్లడించింది. భారత్‌లో తక్కువ


ఉత్పత్తి ఖర్చులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటివి దీనికి దోహదం చేస్తాయని పేర్కొంది. జీటీఆర్‌ఐ నివేదిక ప్రకారం.. భారత్‌లో ఒక ఐఫోన్ అసెంబ్లింగ్‌ ఖర్చు సుమారు 30 డాలర్లు కాగా, అమెరికాలో 390


డాలర్లు వెచ్చించాల్సి ఉంటుంది. దీని కారణంగా భారత్‌లో కార్మికుల జీతాలు తక్కువగా ఉండటమే. దేశంలో ఒక కార్మికుడికి నెల సంపాదన సగటున 230 డాలర్లు (రూ.19,000). అదే అమెరికాలో కనీస వేతన చట్టాల కారణంగా


ఈ సంపాదన 2,900 డాలర్ల (రూ.2.4 లక్షలు) వరకు ఉంటుంది. అంటే దాదాపు 13 రెట్ల వ్యత్యాసం. దీనికితోడు భారత ప్రభుత్వం అందించే పీఎల్‌ఐ పథకం కూడా యాపిల్‌కు అదనపు లాభాల్ని అందిస్తోంది. దీంతో  ఐఫోన్ల


ఉత్పత్తిపై 25 శాతం సుంకం విధించినా భారత్‌లో చౌకగానే తయారవుతాయని నివేదిక తెలుపుతోంది. * ఆ ఐఫోన్లకు 25% సుంకం ఐఫోన్లను 12కు పైగా దేశాలు కలిపి తయారుచేస్తాయి. యాపిల్‌ తన బ్రాండ్‌, సాఫ్ట్‌వేర్‌,


డిజైన్‌లతో ఒక్కో ఐఫోన్‌పై 450 డాలర్ల లాభం ఆర్జిస్తుంది. ఇక అమెరికాలో ఐఫోన్లను తయారుచేస్తే.. ఉత్పత్తి ఖర్చులు పెరుగుతాయి. దీనికి అనుగుణంగా రిటైల్‌ ధరలు పెంచకపోతే యాపిల్‌ లాభం 450 డాలర్ల నుంచి


60 డాలర్లకు పడిపోవచ్చని పేర్కొంది. భారత్‌లో ఐఫోన్ల తయారీకి అమెరికా విధించే సుంకాల ముప్పు ఉన్నప్పటికీ ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని జీటీఆర్‌ఐ నివేదిక స్పష్టం చేసింది.