Play all audios:
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ, ఫ్యాషన్ ప్రియులు ఎంతో ప్రత్యేకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes 2025) అట్టహాసంగా జరిగింది. కేన్స్ నగరం వేదికగా ఈ నెల 13వ తేదీన
మొదలైన ఈ చలన చిత్రోత్సవం శనివారంతో ముగిసింది. మన దేశం తరఫున పలువురు సుందరీమణులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఖరీదైన దుస్తులు ధరించి తమ స్టైల్తో రెడ్ కార్పెట్పై హొయలొలికించారు. ముగింపు రోజు
అలియాభట్ (Alia Bhatt) సూపర్ లుక్లో అదరగొట్టారు. ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ గూచి సిద్ధం చేసిన చీర ధరించి ఆమె రెడ్ కార్పెట్పై ఫొటోలకు పోజులిచ్చారు. గూచి చీరలో మెరిసిన అలియా..! తొలిసారి
కేన్స్లో సందడి చేశారు నటి అలియాభట్. తొలి రోజు ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఫ్లోరల్ గౌనుతో ఆమె వేడుకల్లో మెరిశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఇన్స్టా వేదికగా షేర్ చేస్తూ.. ‘హలో కేన్స్’ అనే
క్యాప్షన్ జత చేశారు. చివరి రోజు ఆమె గూచి బ్రాండ్ సిద్ధం చేసిన తొలి చీరలో తళుక్కున మెరిశారు. దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. గూచి చీరకు ఫ్యాషన్ ప్రియులు ఫిదా అవుతున్నారు. మన తారలు
ఎవరు పాల్గొన్నారంటే..: ఈసారి వేడుకలకు భారత్ నుంచి చాలామంది సెలబ్రిటీలు హాజరయ్యారు. మనీశ్ మల్హోత్రా డిజైన్ చేసిన చీర కట్టుకుని.. సిందూరం ధరించి ఐశ్వర్య రాయ్ (Aishwarya rai) ఈ ఏడాది
ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 2002లో చీరకట్టులో కేన్స్లో పాల్గొన్న ఐష్.. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత భారతీయ సంప్రదాయ దుస్తుల్లో హాజరయ్యారు. ‘ఆపరేషన్ సిందూర్’కు మద్దతుగానే ఆమె సిందూరం ధరించి
వెళ్లారని నెటిజన్లు భావించారు. రెండో రోజు ఆమె ధరించిన కేప్పై భగవద్గీత శ్లోకం ముద్రించి ఉండటం భారతీయుల మది గెలిచింది. ‘హోమ్ బౌండ్’ ప్రీమియర్ కోసం మహారాణి లుక్లో జాన్వీకపూర్
పాల్గొన్నారు. కరణ్ జోహార్, ఇషాన్ ఖట్టర్తో కలిసి రెడ్ కార్పెట్పై ఫొటోలు దిగారు. పెళ్లి కూతురు అవతారంలో మోడల్ రుచి గుజ్జర్ ఇక్కడ సందడి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోలతో కూడిన
నెక్లెస్ను ధరించి ఆకట్టుకున్నారు. మోడల్ సోనమ్ ఛబ్రా వినూత్న డిజైన్తో ఉన్న గౌనుతో ప్రదర్శనలో ఆకట్టుకున్నారు. ‘2008- ముంబయి, 2016- ఉరీ, 2019- పుల్వామా, 2025 - పహల్గాం’ అనే పదాలు గౌనుపై
ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. వీరితోపాటు నితాన్షీ గోయెల్, అదితి రావు హైదరీ, ఊర్వశీ రౌతేలా, సోషల్మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నాన్సీ త్యాగి, నటాషా పూనావాలా కూడా ఈవేడుకల్లో పాల్గొన్నారు.