Play all audios:
గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రకటనపై అగ్ర కథానాయకుడు చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ ఫిల్మ్
అవార్డ్స్-2024పై అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) హర్షం వ్యక్తం చేశారు. అవార్డులు దక్కించుకున్న ప్రతి ఒక్కరికీ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అవార్డుల సంప్రదాయాన్ని
పునరుద్ధరించిన సీఎం రేవంత్రెడ్డికి (Revanth Reddy) ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. > ‘‘గద్దర్ తెలంగాణ > ఫిల్మ్ అవార్డ్స్కు > ఎంపికైన ప్రతి ఒక్కరికీ > హృదయపూర్వక శుభాకాంక్షలు.
> రాష్ట్ర ప్రభుత్వ > గుర్తింపు నిజంగా ఎంతో > విలువైనది. సృజనాత్మక > రంగంలో ఉన్న ప్రతి నటుడు, > టెక్నీషియన్కు ఎంతో > ప్రేరణనిస్తుంది. > అద్భుతమైన సంప్రదాయాన్ని >
తెలంగాణ ప్రభుత్వం > పునరుద్ధరించటం, ఎంతో > గొప్ప > ప్రోత్సాహాన్నిస్తోంది. > గౌరవ ముఖ్యమంత్రి > రేవంత్రెడ్డి, > సంబంధితశాఖ మంత్రులు, > అధికారులకు, అవార్డుల > కమిటీకి
ప్రత్యేక > కృతజ్ఞతలు > తెలియజేస్తున్నా’’ > -చిరంజీవి గద్దర్ అవార్డుల ప్రకటనపై అగ్ర కథానాయకులు అల్లు అర్జున్, ఎన్టీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు
తెలిపారు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్ర నిర్మాత నిహారిక కొణిదెల, చిత్ర బృందం సైతం సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రానికి జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతిపై తీసిన ఉత్తమ
ఫీచర్ ఫిల్మ్ అవార్డు వచ్చింది.