Sumant kathpalia: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ మాజీ సీఈఓపై సెబీ నిషేధం

Sumant kathpalia: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ మాజీ సీఈఓపై సెబీ నిషేధం

Play all audios:

Loading...

Sumant Kathpalia: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ మాజీ సీఈఓ సుమంత్‌ కత్‌పాలియాపై సెబీ నిషేధం విధించింది. సెక్యూరిటీస్‌ మార్కెట్లో పాల్గొనకుండా చర్యలు చేపట్టింది. Sumant Kathpalia | దిల్లీ: ప్రైవేటురంగ


బ్యాంక్‌ ఇండస్‌ఇండ్‌ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంక్‌ మాజీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమంత్‌ కత్‌పాలియా (Sumant Kathpalia)పై సెబీ చర్యలు తీసుకుంది. ఆయనతో పాటు బ్యాంక్‌కు


చెందిన మరో నలుగురి సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లను సెక్యూరిటీస్‌ మార్కె్ట్లలో పాల్గొనకుండా నిషేధం విధిచింది. వీరంతా బ్యాంక్‌ షేర్లలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి వీరిపై ఈ


చర్యలు చేపపట్టింది. ఈ ఐదుగురికి రూ.19.78 కోట్లు జరిమానా విధిస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ నిబంధనలను ఉల్లంఘించి స్టాక్‌కు సంబంధించిన సున్నిత సమాచారంతో ఇండస్‌ఇండ్


బ్యాంక్ షేర్లలో వీరు వ్యాపారం చేశారన్న ఆరోపణలపై సెబీ ఈ చర్యలకు ఉపక్రమిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసంది. చర్యలు ఎదుర్కొన్న వాళ్లలో మాజీ సీఈఓతో పాటు ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఎగ్జిక్యూటివ్‌


డైరెక్టర్‌, డిప్యూటీ సీఈఓగా వ్యవరించిన అరుణ్‌ ఖురానా, ట్రెజరీ ఆపరేషన్స్‌ హెడ్‌ సుశాంత్ సౌరవ్‌, జీఎంజీ ఆపరేషన్స్‌ హెడ్‌ రోహన్‌ జతన్న, కన్జూమర్‌ బ్యాంకింగ్‌ చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌


అనిల్‌ మార్కోరావు ఉన్నారు. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో అకౌంటింగ్‌ లోపాల నేపథ్యంలో సీఈఓ, డిప్యూటీ సీఈఓ తమ పదవులకు రాజీనామా చేశారు.