Operation sindoor: రాజస్థాన్‌లో పాక్‌ బోర్డర్‌ సీల్‌.. పంజాబ్‌లో హైఅలర్ట్‌..

Operation sindoor: రాజస్థాన్‌లో పాక్‌ బోర్డర్‌ సీల్‌.. పంజాబ్‌లో హైఅలర్ట్‌..

Play all audios:

Loading...

Operation Sindoor ఇంటర్నెట్‌డెస్క్‌: పాకిస్థాన్‌తో సరిహద్దులు పంచుకొంటున్న రాష్ట్రాల్లో భద్రతా చర్యలు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. రాజస్థాన్‌లో 1,037 కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్‌


సరిహద్దును సీల్‌ చేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే.. కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇక భారత వాయుసేన కూడా పూర్తి అప్రమత్తంగా ఉంది. మే 9వ తేదీ వరకు జోధ్‌పుర్‌,


బికనేర్‌, కిషన్‌ఘర్‌ విమానాశ్రయాలను మూసివేశారు. గగనతలంలో యుద్ధవిమానాల గస్తీ కాస్తున్నారు. ఇక్కడ మిసైల్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను యాక్టివేట్‌ చేశారు.  ఇక పంజాబ్‌లో ప్రభుత్వం కీలక చర్యలు


తీసుకొంది. సరిహద్దుల్లోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేసింది. వీటిల్లో ఫిరోజ్‌పుర్‌, పఠాన్‌కోట్‌, ఫజ్లికా, అమృత్‌సర్‌, గురుదాస్‌పుర్‌, తార్న్‌ తరన్‌ ప్రాంతాల్లో 72 గంటలపాటు స్కూళ్లను


మూసివేశారు. రాష్ట్ర పోలీస్‌శాఖ, ఇతర దళాల్లో సెలవులను రద్దు చేసి.. సిబ్బంది తక్షణమే విధులకు హాజరుకావాలని పేర్కొన్నారు.  జమ్మూకశ్మీర్లో నేడు కూడా పాకిస్థాన్‌ దళాలు శతఘ్ని గుండ్లను


కాలుస్తున్నాయి. దీంతో మన సైన్యం దీటుగా బదులిస్తోంది. పౌర నివాసాలే లక్ష్యంగా పాక్‌ సైన్యం కాల్పులు జరుపుతోంది. ఇప్పటికే వీటిల్లో ఒక జవాన్‌ సహా 13 మంది చనిపోయారు.  మంగళవారం రాత్రి అందరూ


నిద్రపోతున్నవేళ.. క్షిపణులు, డ్రోన్లతో పాకిస్థాన్‌తోపాటు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌పై ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో విరుచుకుపడింది. సరిహద్దుకు ఆవల 100 కిలోమీటర్ల దూరం వరకూ వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను


ధ్వంసం చేసింది. 80 మంది ఉగ్రవాదులను హతమార్చింది. పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకుంది.