Neet-pg 2025: ఒకే షిఫ్ట్‌లో నీట్‌ పీజీ పరీక్ష: సుప్రీం ఆదేశం

Neet-pg 2025: ఒకే షిఫ్ట్‌లో నీట్‌ పీజీ పరీక్ష: సుప్రీం ఆదేశం

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌డెస్క్‌: నీట్‌ పీజీ-25 (NEET-PG 2025) ప్రవేశ పరీక్ష విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహించాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ ప్రవేశ పరీక్షను జూన్ 15న


రెండు విడతల్లో నిర్వహించి, జులై 15న ఫలితాలు విడుదల చేస్తామని నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్ (NEB) ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆదేశాలు వచ్చాయి. పరీక్షను రెండు విడతల్లో నిర్వహించడం వల్ల ప్రశ్నల


క్లిష్టత స్థాయి మారి కొందరు విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందని ఎన్‌ఈబీ నిర్ణయంపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే దానిని ఒకేవిడతలో నిర్వహించేలా బోర్డ్‌ను ఆదేశించాలని కోరుతూ సుప్రీంలో పలు పిటిషన్లు


దాఖలయ్యాయి. వాటిపై విచారణ జరిపిన కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే ఒకే షిఫ్ట్‌లో పరీక్ష నిర్వహణ కోసం కేంద్రాలు, సమయం సరిపోదంటూ ఎన్‌ఈబీ వినిపించిన వాదనను సుప్రీం తోసిపుచ్చింది. జూన్ 15న


పరీక్ష నిర్వహణ కోసం ఏర్పాట్లు చేసేందుకు తగిన సమయం ఉందని వ్యాఖ్యానించింది.