Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: అన్నింటి కంటే దేశం ముఖ్యమని నటి రిద్ధి డోగ్రా (Ridhi Dogra) అన్నారు. తాను నటించిన ‘అబీర్ గులాల్’ (Abir Gulaal) సినిమా వాయిదాపై అలా స్పందించారు. పాకిస్థాన్ నటుడు
ఫవాద్ఖాన్ (Fawad Khan) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం విడుదల కావాల్సిన ఉండగా.. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వాయిదా పడింది. ఈ క్రమంలో ఆమె ఓ చిట్చాట్లో మాట్లాడారు. సినిమాకి సంబంధించి
ప్రస్తుతానికి ఏ విశేషాలు చెప్పలేనని అన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఈ సినిమాని భారత ప్రభుత్వం బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఆర్తి ఎస్. బగ్దీ తెరకెక్కించిన ఈ సినిమాలో రిద్ధి కీలక పాత్ర
పోషించగా వాణీ కపూర్ హీరోయిన్.