Ajay devgn: ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు.. కానీ: అజయ్‌ దేవ్‌గణ్‌

Ajay devgn: ఎవరూ యుద్ధాన్ని కోరుకోరు.. కానీ: అజయ్‌ దేవ్‌గణ్‌

Play all audios:

Loading...

ఇంటర్నెట్‌ డెస్క్: ఏప్రిల్‌ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడి తర్వాత జరిగిన పరిణామాల గురించి బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవ్‌గణ్‌ (Ajay Devgn) మాట్లాడారు. కశ్మీర్‌లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడికి


ప్రతీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌ను విజయవంతంగా పూర్తి చేసినందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, భారత సాయుధ దళాలను ఆయన అభినందించారు. బుధవారం ముంబయిలో జరిగిన ‘కరాటే కిడ్‌: లెజెండ్స్‌’ ట్రైలర్‌ లాంచ్‌


ఈవెంట్‌కు అజయ్‌ దేవ్‌గణ్‌ తన కుమారుడితో కలిసి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన తొలిసారి ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) గురించి మాట్లాడారు. ‘‘నేను ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరూ


యుద్ధాన్ని కోరుకోరు. కానీ.. దీనికి వేరే మార్గం లేనప్పుడు యుద్ధమే ఏకైక మార్గం అవుతుంది. నేను సాయుధ దళాలకు, ప్రధానికి, ప్రభుత్వానికి సెల్యూట్‌ చేస్తున్నాను. వారి పనిని వారు ధైర్యంగా,


ప్రశంసనీయంగా చేశారు’’ అని అన్నారు. ఇక బాలీవుడ్‌ సెలబ్రిటీలు ఆపరేషన్‌ సిందూర్‌ గురించి పెదవి విప్పడం లేదంటూ ఇటీవల కొన్ని విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే. వాటికి చెక్‌ పెట్టేందుకు తాజాగా


కొందరు బీ టౌన్‌ ప్రముఖులు దీని గురించి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. రణ్‌ వీర్‌సింగ్‌, అక్షయ్‌ కుమార్‌లు సాయుధదళాలపై ప్రశంసలు కురిపిస్తూ ఇటీవల పోస్ట్‌లు పెట్టారు. * పవర్‌ఫుల్‌ పాత్రలో


ఎన్టీఆర్‌.. ఆ బయోపిక్‌లో నటించనున్న హీరో! పహల్గాంలో అమాయక పౌరులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకలపై భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తోన్న పాకిస్థాన్‌కు గట్టిగా బదులు


చెప్పింది. పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై ‘ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor)’ పేరుతో మెరుపు దాడులతో విరుచుకుపడింది.  100 మంది ఉగ్రవాదులను హతమార్చింది.