Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ‘హరి హర వీరమల్లు’ నిర్మాత ఎ.ఎం.రత్నం స్పృహ తప్పి పడిపోయారనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారిన విషయం తెలిసిందే. దీనిపై ఆయన సోదరుడు, నిర్మాత దయాకర్ రావు స్పష్టతనిచ్చారు.
వాటిని నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara VeeraMallu). ఈ సినిమా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల
కానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం వరుస ఈవెంట్లు, ప్రెస్మీట్లు నిర్వహిస్తోంది. తాజాగా చెన్నై వేదికగా ప్రెస్మీట్ను నిర్వహించారు. దీని అనతరం నిర్మాత ఎ.ఎం.రత్నం స్పృహ తప్పి పడిపోయారనే వార్తలు
వైరల్ అయ్యాయి. తాజాగా దీనిపై దయాకర్ రావు స్పష్టతనిచ్చారు (AM Ratnam Health). ‘‘అన్నయ్య హెల్త్పై వస్తోన్న రూమర్స్ నమ్మకండి. ఆయన పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు. దయచేసి ఇలాంటి రూమర్స్ను ప్రచారం
చేయకండి’’ అని పోస్ట్ పెట్టారు. * 28 రోజులు మాత్రమే మిగిలిఉంది: ‘కన్నప్ప’పై విష్ణు పోస్ట్ ఇక ‘హరిహర వీరమల్లు’ విషయానికొస్తే.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు
శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా పవన్ తన పాత్రకు డబ్బింగ్ పూర్తి చేశారు. ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా రాత్రి 10 గంటలకు డబ్బింగ్ మొదలవగా ఏకధాటిగా నాలుగు గంటల్లో పూర్తిచేశారని టీమ్
పేర్కొంది. క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పవన్కల్యాణ్ పోరాట యోధుడిగా కనిపించనున్నారు. నిధి అగర్వాల్ కథానాయిక. బాబీ దేవోల్, అనుపమ్ ఖేర్, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రలు
పోషించారు.