Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: ‘నానుమ్ రౌడీ దాన్’ డాక్యుమెంటరీ వివాదంపై నయనతార, ధనుష్లు కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. నటి నయనతార (Nayanthara), ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan)పై
ధనుష్ (Dhanush) దావా వేశారు. పర్మిషన్ లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్ను ‘నయనతార బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో ఆయన నిర్మాణసంస్థ మద్రాస్ హైకోర్టును
ఆశ్రయించింది. ఈ మేరకు నయన్ దంపతులతోపాటు వారికి చెందిన రౌడీ పిక్చర్స్పైనా దావా వేసింది. అయితే ధనుష్ దావాను సవాల్ చేస్తూ నెట్ఫ్లిక్స్ ఓ పిటిషన్ను దాఖలు చేసింది. తాజాగా నెట్ఫ్లిక్స్
దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది. * మహేశ్-రాజమౌళి మూవీ.. షరతులు వర్తిస్తాయి! అసలేం జరిగిందంటే.. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో నయనతార హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘నానుమ్ రౌడీ
దాన్’ (Naanum Rowdy Dhaan). దీనిని ధనుష్ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే విఘ్నేశ్ - నయన్ ప్రేమ మొదలైంది. పెద్దల అంగీకారంతో 2022లో పెళ్లి చేసుకున్నారు. నయన్ కెరీర్, ప్రేమ,
పెళ్లిపై నెట్ఫ్లిక్స్ ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ (Nayanthara Beyond The Fairy Tale) అనే డాక్యుమెంటరీ సిద్ధం చేసింది. తమ జీవితంలో ఎంతో ముఖ్యమైన ‘నానుమ్ రౌడీ దాన్’ వీడియోలు,
పాటలను ఇందులో చూపించాలని ఈ జోడీ భావించింది. కాకపోతే దానికి ధనుష్ నుంచి ఆమోదం లభించలేదు. ఇటీవల డాక్యుమెంటరీ విడుదల కాగా.. అందులో సినిమాకు సంబంధించిన మూడు సెకన్ల ఫుటేజ్ వాడుకోవడంపై ధనుష్
లీగల్ నోటీసు పంపించారు. ధనుష్ పంపిన నోటీసులను సవాలు చేస్తూ నెట్ఫ్లిక్స్ పిటిషన్ దాఖలు చేసింది. కాగా నెట్ఫ్లిక్స్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది.