Indw vs slw: ముక్కోణపు సిరీస్ ఫైనల్.. దంచేసిన భారత బ్యాటర్లు.. శ్రీలంక ముందు భారీ టార్గెట్

Indw vs slw: ముక్కోణపు సిరీస్ ఫైనల్.. దంచేసిన భారత బ్యాటర్లు.. శ్రీలంక ముందు భారీ టార్గెట్

Play all audios:

Loading...

కొలంబో: మహిళల వన్డే ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌లో భారత్, శ్రీలంక తలపడుతున్నాయి. టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్‌ఇండియా బ్యాటర్లలందరూ రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 342


పరుగులు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (116; 101 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకంతో ఆకట్టుకుంది. హర్లీన్‌ డియోల్ (47; 56 బంతుల్లో), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41; 30 బంతుల్లో), జేమీమా


రోడ్రిగ్స్ (44; 29 బంతుల్లో), ప్రతీకా రావల్ (30) రాణించారు. అమన్‌జ్యోత్ కౌర్ (18), రిచా ఘోష్ (8), దీప్తి శర్మ (20*) పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో దేవ్మీ విహంగా 2, సుగందికా కుమారి 2, మదార


2, ఇనోకా రణవీర ఒక వికెట్ పడగొట్టారు.   మంధాన, ప్రతీకా భారత్‌కు శుభారంభం అందించారు. ఈ జోడీ తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించింది. నిలకడగా ఆడుతున్న ప్రతీకాను ఇనోకా రణవీర వెనక్కి పంపింది. అనంతరం


హర్లీన్‌ డియోల్‌తో జతకట్టిన మంధాన.. 55 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకుంది. నిలకడగా బౌండరీలు బాది సెంచరీకి చేరువైన మంధాన.. చమీర ఆటపట్టు వేసిన 31 ఓవర్‌లో వరుసగా నాలుగు ఫోర్లు రాబట్టింది. ఈ


క్రమంలోనే వన్డేల్లో 11వ సెంచరీ (92 బంతుల్లో) పూర్తి చేసుకుంది. జోరుమీదున్న స్మృతిని దేవ్మీ విహంగా పెవిలియన్‌కు పంపింది. కాసేపటికే హర్లీన్‌ కూడా ఔటైంది. దేవ్మీ బౌలింగ్‌లో ఆమెకే రిటర్న్‌


క్యాచ్ ఇచ్చింది. దూకుడుగా ఆడిన హర్మన్‌ప్రీత్.. సుగందికా కుమారి బౌలింగ్‌లో మదారకు చిక్కింది. తర్వాత వచ్చిన రిచా ఘోష్‌ను మందార వెనక్కి పంపింది. అర్ధ శతకానికి చేరువైన జెమీమాను సుగందికా


బౌలింగ్‌లో ఔటైంది. చివరి నాలుగు ఓవర్లలో భారత్ ఒక వికెట్ నష్టపోయి 37 పరుగులు రాబట్టింది.