Play all audios:
చంఢీగడ్: ఐపీఎల్ (IPL) 2025లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) క్వాలిఫయర్ -2కి దూసుకెళ్లింది. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబయి 20 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆదివారం జరగనున్న క్వాలిఫయర్-2లో పంజాబ్, ముంబయి తలపడనున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన హార్దిక్ సేన.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్యఛేదనలో గుజరాత్ పోరాడి ఓడింది.
20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (80; 49 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (48; 24 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్లు) చెలరేగినా గుజరాత్కు ఓటమి
తప్పలేదు. కమిందు మెండిస్ (20), రూథర్ఫోర్డ్ (24), రాహుల్ తెవాతియా (16*) షారుక్ ఖాన్ (13) పరుగులు చేశారు. చివర్లో ముంబయి బౌలర్లు పుంజుకొని పరుగులు కట్టడి చేయడంతో స్కోరు వేగం తగ్గి గుజరాత్
ఓటమి చవిచూసింది. ముంబయి బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, బుమ్రా, రిచర్డ్ గ్లిసన్, శాంట్నర్, అశ్వని కుమార్ ఒక్కో వికెట్ పడగొట్టారు. చెలరేగిన రోహిత్.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి భారీ
స్కోరు చేసింది. రోహిత్ శర్మ (81; 50 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లు) దంచికొట్టాడు. ఆరంభంలో రెండు లైఫ్లు అందుకున్న రోహిత్.. తర్వాత బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అతను 28 బంతుల్లోనే అర్ధ శతకం
పూర్తి చేసుకున్నాడు. జానీ బెయిర్స్టో (47; 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లు) త్రుటిలో అర్ధ శతకం మిస్ చేసుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్ (33; 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు), తిలక్ వర్మ (25;
11 బంతుల్లో 3 సిక్స్లు), హార్దిక్ పాండ్య (22*; 9 బంతుల్లో 3 సిక్స్లు) క్రీజులో ఉన్నంతసేపు మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో సాయి కిశోర్ 2, ప్రసిద్ధ్ కృష్ణ 2, సిరాజ్ ఒక వికెట్
పడగొట్టారు. * ఈ మ్యాచ్లో నాలుగు సిక్స్లు కొట్టిన రోహిత్ ఐపీఎల్లో 300 సిక్స్లు పూర్తి చేసుకున్నాడు. * ఐపీఎల్లో 300 సిక్స్లు సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం
రోహిత్ ఖాతాలో 301 సిక్స్లున్నాయి. * అంతేకాదు ఐపీఎల్లో 7 వేల పరుగుల మైలురాయి అందుకున్నాడు.