Play all audios:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తాను ఒత్తిడికి గురయ్యానని రజత్ పటీదార్ అన్నాడు. ఆ సమయంలో తనకు విరాట్ కోహ్లీ మద్దతుగా నిలిచాడని ఆర్సీబీ
పాడ్కాస్ట్లో వివరించాడు. ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీ (Virat Kohli) నుంచి తనకు లభించిన ప్రోత్సాహాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) కెప్టెన్ రజత్
పటీదార్ ఆర్సీబీ పాడ్కాస్ట్లో వివరించాడు. డుప్లెసిస్ను జట్టు మెగావేలంలో వదులుకున్న తర్వాత రజత్ పటీదార్ను కెప్టెన్గా నియమించింది. అప్పుడు తాను తీవ్ర ఒత్తిడికి గురైనట్లు చెప్పాడు. ఆ
సమయంలో తనను విరాట్ కోహ్లీ వెన్నుతట్టి ప్రోత్సహించి, తనకు ఎంతో మద్దతుగా నిలిచాడన్నాడు. ‘‘నేను టీవీ వీక్షించడం ప్రారంభించినప్పటి నుంచి విరాట్ కోహ్లీని ఐపీఎల్లో(IPL), భారత క్రికెట్
జట్టులో(Team India) చూస్తూనే ఉన్నాను. అతడు చాలా సంవత్సరాలు ఆర్సీబీకి కెప్టెన్గా వ్యవహరించాడు. అతడి నుంచి నేను సారథ్య బాధ్యతలు స్వీకరించినప్పుడు ఒకింత ఆందోళనకు గురయ్యా. కానీ, అప్పుడు అతడు
‘నువ్వు కెప్టెన్సీకి అర్హుడివి. నువ్వు దీన్ని సాధించుకున్నావు’ అన్నాడు. ఆ మాటలతో నాలో కాస్త ధైర్యం వచ్చింది. నేను విరాట్ కోహ్లీ నుంచి ఎంత వీలైతే అంత నేర్చుకున్నా. అతడు నన్ను చాలామంది
అభిమానులకు పరిచయం చేశాడు. అది నాకు ప్రత్యేకమైన క్షణం’’ అని రజత్ పటీదార్ తనకు విరాట్ కోహ్లీతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. రజత్ పటీదార్ సారథ్యంలోని ఆర్సీబీ ప్రస్తుత ఐపీఎల్లో 16
పాయింట్లు సాధించింది. ప్లేఆఫ్స్నకు చేరుకోవడానికి అడుగు దూరంలో ఉంది. పటీదార్ ఈ ఐపీఎల్ సీజన్లో 239 పరుగులు చేశాడు. సారథిగానూ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. కానీ అతడి ముందు మరి కొన్ని
సవాళ్లున్నాయి. మే17 నుంచి ఐపీఎల్ పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఆర్సీబీ జట్టు కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders), సన్రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad), లఖ్నవూ సూపర్
జెయింట్స్తో (Lucknow Super Giants) తలపడాల్సి ఉంది. వీటిలో విజయాలే బెంగళూరు ప్లేఆఫ్స్ను నిర్ణయించనున్నాయి. రజత్ పటీదార్కు ఇంతకుముందు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్కు
కెప్టెన్గా వ్యవహరించిన అనుభవమూ ఉంది. దీంతో ఈ సారి ఆర్సీబీ తేలికగానే ప్లేఆఫ్స్నకు చేరుకుంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.