Acb: ఏసీబీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను డబ్బులు డిమాండ్‌ చేస్తే చర్యలు: విజయ్‌కుమార్‌

Acb: ఏసీబీ పేరుతో ప్రభుత్వ ఉద్యోగులను డబ్బులు డిమాండ్‌ చేస్తే చర్యలు: విజయ్‌కుమార్‌

Play all audios:

Loading...

అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) అధికారులమని ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డైరెక్టర్ విజయ్‌ కుమార్‌ తీవ్రంగా హెచ్చరించారు. హైదరాబాద్‌: అవినీతి నిరోధకశాఖ


(ఏసీబీ) అధికారులమని ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డైరెక్టర్ విజయ్‌ కుమార్‌ తీవ్రంగా హెచ్చరించారు. ఇలాంటి మోసాలు తమ దృష్టికి వచ్చినట్టు ఆయన తెలిపారు.


ఏసీబీ అధికారులు ఎవరూ కేసుల విషయంలో కానీ, ఇతర కారణాలతోనూ డబ్బులు డిమాండ్‌ చేయరని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఈ మోసగాళ్లు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారని తెలిసిందని ఏసీబీ


డైరెక్టర్‌ తెలిపారు. తాజాగా ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఓ నకిలీ ఏసీబీ అధికారిపై కేసు నమోదైందని వెల్లడించారు. ఏసీబీ అధికారులుగా చెప్పుకొంటూ ఎవరైనా ఫోన్‌ చేస్తే ప్రభుత్వ


ఉద్యోగులకు తక్షణమే అప్రమత్తమై ఏసీబీ టోల్-ఫ్రీ నంబర్ 1064కు, స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీబీ డైరెక్టర్‌ హామీ


ఇచ్చారు.