Kishan reddy: గత పదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు: కిషన్‌రెడ్డి

Kishan reddy: గత పదేళ్లలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు: కిషన్‌రెడ్డి

Play all audios:

Loading...

హైదరాబాద్: ఎంతో మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి (Kishan Reddy) అన్నారు. భాజపా (BJP) రాష్ట్ర కార్యాలయంలో జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవ కార్యక్రమంలో ఆయన


పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ‘‘తెలంగాణ ఉద్యమం అహింసా పద్ధతిలో సాగింది. ఉద్యమంలో భాజపా కీలక పాత్ర పోషించింది. తెలంగాణకు అనుకూలమని అందరికంటే ముందు నిర్ణయం తీసుకున్న


పార్టీ మాది. తెలంగాణ వచ్చాక నీళ్ల పేరుతో నిధుల దోపిడీ జరిగింది. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత భావించింది. కేసీఆర్‌ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయి కానీ.. యువతకు రాలేదు. ఏ ఆకాంక్షల కోసం


ప్రజలు పోరాడారో గత పదేళ్లలో అవి నెరవేరలేదు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణ ఇవాళ రూ.10 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్లింది’’ అని కిషన్‌రెడ్డి అన్నారు.