Play all audios:
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ఆదివారం ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) తెలిపారు. హైదరాబాద్: ఆదివారం నుంచి నాలుగు
కొత్త పథకాలు ప్రారంభిస్తామని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ పథకాలను ఆదివారం ప్రారంభించనున్నట్లు
చెప్పారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. గ్రామాల్లోని లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు
తీసుకోవాలని ఆదేశించారు. నిజమైన లబ్ధిదారుల్లో ఏ ఒక్కరికీ అన్యాయం జరగవద్దని సూచించారు. అనర్హులకు లబ్ధి చేకూరిస్తే ఆయా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి
విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (Telangana News)