Play all audios:
(ప్రతీకాత్మక చిత్రం) ఇంటర్నెట్డెస్క్: మయన్మార్ (Myanmar) తీరంలో రెండు ఓడలు మునిగిపోవడంతో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. 427 మంది రోహింగ్యాలు (Rohingya) ప్రాణాలు కోల్పోయినట్లు
తెలుస్తోంది. మే 9, 10వ తేదీల్లో ఈ ఘోర ప్రమాదాలు జరిగినట్లు ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఈ విషయం నిర్ధరణ అయితే ‘సముద్రంలో చోటుచేసుకున్న అత్యంత విషాదకర ఘటన’గా ఇది మిగిలిపోతుందని ఆందోళన
వ్యక్తంచేసింది (Shipwrecks). ఓడల ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్లు ఐరాస అనుబంధ శరణార్థి విభాగం అంచనా వేస్తోంది. తొలి ప్రమాదం మే 9న చోటుచేసుకోగా 267 మందిలో 66 మంది బతికి బయటపడినట్లు
ప్రాథమికంగా వెల్లడించింది. మే 10న రెండో నౌక ప్రమాదానికి గురికాగా.. 21 మంది బతికి బయటపడినట్లు సమాచారం. వాస్తవానికి రోహింగ్యాలు.. మయన్మార్లో నివసిస్తుంటారు. కానీ, సైన్యం మారణహోమం నుంచి
తప్పించుకునేందుకుగానూ లక్షలాది రోహింగ్యాలు 2017లో బంగ్లాదేశ్కు తరలిపోయారు. మయన్మార్లో గతేడాది సైనిక తిరుగుబాటు అనంతరం.. వారి వలసలు మరింత పెరిగాయి. దీంతో దక్షిణ బంగ్లాదేశ్లోని శరణార్థి
శిబిరాలు కిక్కిరిసిపోయాయి. అక్కడి పరిస్థితులూ క్షీణించడంతో వారంతా.. ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయేందుకు వలసబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ప్రమాదకర సముద్ర ప్రయాణాలను ఎంచుకుంటున్నారు.