Abhishek sharma-digvesh rathi: మ్యాచ్‌లో దిగ్వేశ్‌తో గొడవ.. స్పందించిన అభిషేక్‌ శర్మ

Abhishek sharma-digvesh rathi: మ్యాచ్‌లో దిగ్వేశ్‌తో గొడవ.. స్పందించిన అభిషేక్‌ శర్మ

Play all audios:

Loading...

Abhishek Sharma-Digvesh Rathi: లఖ్‌నవూ ఆటగాడు దిగ్వేశ్‌ రాఠితో గొడవపై ఎస్‌ఆర్‌హెచ్‌ బ్యాటర్ అభిషేక్‌ శర్మ స్పందించారు. మ్యాచ్‌ అనంతరం ఆ బౌలర్‌తో మాట్లాడినట్లు తెలిపాడు. ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ


ఐపీఎల్‌ సీజన్‌ నుంచి లఖ్‌నవూ సూపర్‌జెయింట్స్‌ ఇంటిముఖం పట్టింది. సోమవారం రాత్రి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓటమిపాలై ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే, ఈ మ్యాచ్‌లో వివాదాస్పద


ఘటన చోటుచేసుకుంది. లఖ్‌నవూ బౌలర్ దిగ్వేశ్‌ రాఠి (Digvesh Rathi), ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు అభిషేక్‌ శర్మ (Abhishek Sharma) మధ్య జరిగిన వాగ్వాదం చర్చనీయాంశమైంది. దీనిపై తాజాగా హైదరాబాద్‌ బ్యాటర్‌


స్పందించాడు. మ్యాచ్‌ తర్వాత దిగ్వేశ్‌తో మాట్లాడినట్లు పేర్కొన్న అభిషేక్‌.. ఇప్పుడు అంతా కూల్‌ అయిపోయిందని వివరణ ఇచ్చాడు. ‘‘గేమ్‌ పూర్తయిన తర్వాత అతడితో (దిగ్వేశ్‌) మాట్లాడా. ఇప్పుడంతా


సద్దుమణిగింది. సవ్యంగానే ఉంది. మేం కూల్‌ అయ్యాం. ఒకవేళ మేం ముందు బ్యాటింగ్‌ చేసి ఉంటే మా ప్లాన్లు వేరేలా ఉండేవి. కానీ, లక్ష్యం పెద్దగా ఉన్నప్పుడు ఛేదన కూడా వ్యూహాత్మకంగానే ఉంటుంది.


పవర్‌ప్లేలో ఎక్కువ పరుగులు చేయాలనే అనుకున్నాం. అందుకోసం నేను దూకుడుగా ఆడక తప్పలేదు’’ అని అభిషేక్ తెలిపాడు. ఇక, మ్యాచ్‌ అనంతరం వీరిద్దరూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకున్నారు. * నాయకుడై నడిపించాడు..


పంజాబ్‌ దశాబ్దం తర్వాత.. అసలేం జరిగిందంటే.. ఈ సీజన్‌ ఆరంభం నుంచి తన సంబరాలతో వివాదాల్లో చిక్కుకుంటూనే ఉన్నాడు లఖ్‌నవూ (LSG) స్పిన్నర్‌ దిగ్వేశ్‌ రాఠి. ఇప్పటికే పలుమార్లు భారీగా జరిమానా కూడా


కట్టాడు. అయినా కూడా అతడు ఆ సంబరాలను ఆపలేదు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (SRH)తో మ్యాచ్‌లో ఒక అడుగు ముందుకేసి ఔటైన బ్యాటర్‌తో వాగ్వాదానికి దిగాడు. మెరుపు షాట్లతో విరుచుకుపడి ఆరంభంలోనే లఖ్‌నవూకు


మ్యాచ్‌ను దూరం చేసిన అభిషేక్‌ శర్మను ఎనిమిదో ఓవర్లో దిగ్వేశ్‌ ఔట్‌ చేసి తన శైలిలో నోట్‌బుక్‌ సంబరాలు కూడా చేసుకోవడం మొదలు పెట్టాడు. పెవిలియన్‌కు వెళ్తూ అభిషేక్‌ అతడిని చూస్తూ ఏదో అన్నాడు.


దీంతో దిగ్వేశ్‌ దూకుడుగా అభిషేక్‌ వైపు దూసుకెళ్లి వాగ్వాదానికి దిగాడు. అంపైర్‌ సర్ది చెప్పి అభిషేక్‌ను బయటకు పంపించాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.