Ktr: ఎన్డీయే ప్రభుత్వం ఈసారైనా రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటుందా? : కేటీఆర్‌

Ktr: ఎన్డీయే ప్రభుత్వం ఈసారైనా రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటుందా? : కేటీఆర్‌

Play all audios:

Loading...

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ ఏటీఎంలా మారిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ (KTR) విమర్శించారు. దర్యాప్తు సంస్థలు కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయన్నారు. ఈమేరకు


‘ఎక్స్‌’ వేదికగా ఆయన పోస్టు చేశారు. ‘‘నేషనల్‌ హెరాల్డ్‌ కేసు ఛార్జ్‌షీట్‌లో రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పేరును ఈడీ చేర్చింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని


ప్రలోభపెట్టారని అందులో పేర్కొంది.  కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈసారైనా రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకుంటుందా? లేదా అమృత్‌ పథకం వంటి స్కామ్‌ల తరహాలో వదిలిపెడతారా అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న.


మరోవైపు రోజురోజుకూ పెరుగుతున్న అంతర్గత కుమ్ములాటలతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కకావికలమైంది’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.(Telangana News)