Play all audios:
ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్లోని అమృత్సర్లో బాంబు పేలుడు కలకలం సృష్టించింది. నగర బైపాస్కు సమీపంలో ఓ వ్యక్తి బాంబు పెట్టడానికి ప్రయత్నిస్తుండగా.. అతడి చేతిలోనే అది పేలిపోవడంతో తీవ్రంగా
గాయపడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ ఘటనా
స్థలానికి చేరుకొని సోదాలు నిర్వహిస్తున్నారు. ఉగ్రకుట్రలో భాగంగా బాంబు పెట్టడానికి ప్రయత్నించారా లేక వేరే ఏదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా ఇటువంటి నిర్జన
ప్రదేశాల్లోనే దేశవ్యతిరేక శక్తులు బాంబులను సరఫరా చేస్తుంటాయని అన్నారు. అదే విధంగా బాంబును తీసుకువచ్చిన వ్యక్తి దానిని తప్పుగా ఆపరేట్ చేయడంతో పేలి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. మృతుడికి
బబ్బర్ ఖల్సాతో సంబంధాలు..? ఈ పేలుడులో మరణించిన వ్యక్తి నిషేధిత బబ్బర్ ఖల్సా ఉగ్ర సంస్థకు చెందిన వాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. తొలుత అతడిని స్క్రాప్ డీలర్గా భావించిన పోలీసులు.. ఆ
తర్వాత ఉగ్ర ముఠాతో సంబంధాలుండొచ్చని భావిస్తున్నారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసినట్లు తెలిపారు.